Tag Archives: Rs 2500

రేషన్ కార్డు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. రూ.2500 నగదు, విలువైన సరుకులు..?

దేశంలోని పలు రాష్ట్రాల్లో హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కొత్త సంవత్సరం వచ్చిన రెండు వారాలకే వచ్చే ఈ పండుగ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పండగకు అవసరమైన సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తుంటాయి. అదే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.

పండుగ సరుకులను ఉచితంగా ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సరుకులను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 2021 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం పళనిస్వామి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారిని దృష్టిలో ఉంచుకుని రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పళనిస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వం 2,500 రూపాయల నగదు తో పాటు కిలో బియ్యం, కిలో చక్కెర, చెరుకుగడ, జీడిపల్లు, కిస్ మిస్ 20 గ్రాములు, 5 గ్రాముల యాలకులు ఇవ్వనుంది. అధికారులు రేషన్ కార్డు ఉన్నవాళ్లకు టోకెన్లు జారీ చేయనుండగా టోకెన్లు ఇచ్చి డబ్బులు, సరుకులు ప్రజలకు పంపిణీ జరిగేలా చేయనున్నారు.

జియో సంచలన నిర్ణయం.. 2,500 రూపాయలకే స్మార్ట్ ఫోన్..?

దేశీయ టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జియో రాకతో దేశంలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఒకప్పుడు 1 జీబీ డేటా కోసం 100 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో తక్కువ ధరకే ఉచిత కాల్స్, డేటాకు ఛార్జీలను వసూలు చేస్తూ టెలీకం రంగంలో అంతకంతకూ ఎదుగుతోంది. అనంతరం జియో ఫోన్ల ద్వారా టెలీకాం రంగంలో జియో మరో సంచలనం సృష్టించింది.

ఫీచర్ ఫోన్లు అయిన జియో ఫోన్లలో కూడా వాట్సాప్, యూట్యూబ్ లను అందుబాటులోకి తెచ్చి జియో ఫీచర్ ఫోన్ల విక్రయాల్లో ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ మార్కెట్ ను సొంతం చేసుకుంది. రోజురోజుకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జియో మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలోనే జియో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ స్మార్ట్ ఫోన్ ధర అందరూ 4,000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని భావించారు. అయితే జియో మాత్రం అంతకంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. జియో కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ జియో సంస్థ 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.
అయితే అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది.

2,500 నుంచి 3,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తే ఇతర స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై జియో స్మార్ట్ ఫోన్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అతి త్వరలో జియో స్మార్ట్ ఫోన్ ప్రజలకు అందుబాటులోకి రానుందని సమాచారం.