Tag Archives: Sam Jam Mega Promo

కళ్లకు గంతలు కట్టుకుని మెగాస్టార్ ఏం చేశారో తెలుసా?

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రముఖ సినీ సెలబ్రిటీస్ మొత్తం ఇంటికే పరిమితమయ్యారు.అయితే ఇంటికే పరిమితమైన హీరోలందరూ ఛాలెంజ్ లో భాగంగా రోజు ఇంటి పనులను చేస్తూ తమ చాలెంజ్ పూర్తి చేసేవారు. ఈ చాలెంజ్ లో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన ఇంటిని శుభ్రం చేస్తూ, అలాగే దోసెలను వేస్తూ తన చాలెంజ్ పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సమంత వ్యాఖ్యాతగా “ఆహా” యాప్ ద్వారా నిర్వహిస్తున్న సామ్ జామ్ అనే టాక్ షో కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు.

ఈ వీడియోలో సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత చిరంజీవిని “మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా”? అనే ప్రశ్నను అడగడంతో అందుకు చిరంజీవి గారు సమాధానం చెబుతూ… ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్ళు పెట్టుకున్నానని, కిందకు వంగి కళ్ళు తుడుచుకుంటున్న సమయంలో లైట్లు వేశారు తాను పైకి లేచేసరికి పైట చేతిలో ఉందని నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా ఈ షోలో చేతులు లేని బాలుడు ఎంతో అద్భుతంగా చిరంజీవి బొమ్మను నోటితో గీయడంతో ఎంతో ఆనంద పడ్డారు.

అంతే కాకుండా సమంత కరోనా సమయంలో దోస చాలెంజ్ ను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా చిరంజీవిగారితో దోసెలను వేయించారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవిగారు కళ్ళకు గంతలు కట్టుకొని దోసే వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది.