Tag Archives: sentational comments

కరోనా మహమ్మారి గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోరాటం తప్పదని చెప్పారు. దేశంలో లాక్ డౌన్ పోయినా కరోనా వైరస్ ముప్పు మాత్రం పోలేదని కామెంట్లు చేశారు. భారత్ మహమ్మారిపై పోరాటం చేస్తుందని.. దేశంలో రికవరీ రేటు బాగుందని మోదీ అన్నారు.

ప్రజలు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. దేశంలో 2 వేల ల్యాబులు కరోనా పరీక్షల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. మరికొన్ని రోజుల్లో పండుగలు రాబోతున్నాయని.. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒక మిలియన్ జనాభాలో 5,500 మంది కి వైరస్ నిర్ధారణ అయిందని మోదీ పేర్కొన్నారు.

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య త్వరలో పది కోట్లు దాటబోతుందని మోదీ అన్నారు. వైద్య వ్యవస్థ ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం కోసం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. నర్సులు, వైద్య సిబ్బంది, వైద్యులు సేవా భావంతో కరోనా వైరస్ చికిత్స కోసం పని చేశారని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టిందని భావిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

వ్యాక్సిన్ కోసం వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. రాత్రీపగలు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారని.. దేశంలో చివరి వ్యక్తికి వ్యాక్సిన్ అందే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. నిర్లక్ష్యం చేస్తే జీవితాలు ప్రమాదాలు పడతాయని తెలిపారు.

నేను రెడ్డిని కాదు క్షత్రియుడిని.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..?

వైసీపీ లోక్ సభ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజురోజుకు తన విమర్శల్లో పదును పెంచుతున్నారు. తాజాగా మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి రఘురామ కృష్ణంరాజు కులాల ప్రస్తావన తెచ్చి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ తాను క్షత్రియుడినని రెడ్డిని కాదని తాను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు పడనని వ్యాఖ్యానించారు.

రెడ్డి అని పేరు చివర ఉండేవాళ్లు తనను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని.. తనను ఎవరూ ఏమీ పీకలేరని.. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఏపీకి వెళితే తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అధికారులను తాను తిట్టినట్టు తనపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. మరోమారు జగన్ పదవి గురించి రఘురామ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ పదవి పోతే ఆయన తల్లి లేదా భార్య సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయని.. భారతికి మంచి తెలివితేటలు ఉన్నాయని ఆమె జగన్ కంటే ఎక్కువ చదువు చదువుకున్నారని వెల్లడించారు. న్యాయానికి సంకెళ్లు వేయడానికి కొంతమంది చెదల్లా ఏపీలో ప్రవర్తిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానాలు ఆ చెద పురుగులను సమూలంగా నాశనం చేస్తాయని అన్నారు. ప్రజలు చెదపురుగులు ఎవరో బాగా తెలుసని వ్యాఖ్యలు చేశారు.

తనది ఆంబోతు ధైర్యం అని చాలామంది తన గురించి మేకపోతు గాంభీర్యం అని అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. రఘురామ మరోమారు సీఎం జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.