Tag Archives: shoba shetty

Monitha: కార్తీకదీపం సీరియల్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న విలన్…అలా క్లారిటీ ఇచ్చిన మోనిత?

Monitha: తెలుగు బుల్లితెరపై విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకొని అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ లో దీప కార్తీక్ పాత్రలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని దీప కోసమే చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సీరియల్ లో మోనిత పాత్రకు కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఈ విధంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో దీప, కార్తీక్ అలాగే మోనిత పాత్రలను ఈ సీరియల్ నుంచి తొలగించారు. ఇందులో దీప కార్తీక్ లను చనిపోయినట్టు చూపించగా మోనిత మాత్రం కార్తీక్ చనిపోయారన్న బాధలో తన కొడుకును సైతం వదిలి వెళ్ళిపోయినట్టు చూపించారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ లో హిమ సౌర్య పెద్దగా అవ్వడం వారి ప్రేమ కథతో నడుస్తుంది.

ఈ విధంగా ఈ సీరియల్లో కొత్త పాత్రలు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే ఏదో ఒక రూపంలో తిరిగి కార్తీక్, దీప,మోనిత పాత్రలను తీసుకువస్తే బాగుండేదని పెద్ద ఎత్తున అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో విలన్ పాత్రలో నటించిన మోనిత తిరిగి ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పరోక్షంగా మోనిత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంతోషంలో అభిమానులు…

ఈ సందర్భంగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను కార్తీకదీపం సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని పోస్ట్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె మాట్లాడుతూ చాలామంది అభిమానులు నన్ను కార్తీక దీపంలోకి రీ ఎంట్రీ ఇవ్వమని అడుగుతున్నారు. రావాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను. నాకైతే ఈ సీరియల్ లోకి రావాలని ఉంది.అయితే ఈ విషయం గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తా అంటూ ఈ సందర్భంగా ఈమె కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

షాకింగ్ ట్విస్ట్.. హిమను చంపింది నేనే.. కనిపించే పిశాచి ఆ మోనిత!

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. గత ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి అంజిను వెతుకుతూ వెళ్తారు. చివరికి మోనిత అంజి ఉంటున్న హోటల్ కి వెళ్లి తను మారిపోయానని అంజితో చెబుతుంది. అయినప్పటికీ అంజి నమకపోవడంతో తన విశ్వరూపం బయటపడుతుంది. ఇక నేడు కార్తీకదీపం సీరియల్ 110 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈ రోజు హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం…

హోటల్ గదిలో అంజి మోనిత మాట్లాడుతూ ఉండగా దీపమ్మకు ఏమైనాచేసావో అనిఅంటుండగా..మూయరా రాస్కెల్.. ఎవతి రా.. దీప అదే మైనస్ నీ అక్క, నీ చెల్లా… అందరూ దీప భజన చేస్తారు. ఏం పెట్టింది రా..అది నీకు ఇంత పచ్చడి మెతుకులు అయినా వండి పెట్టింది రా.. .ఇదేమి విశ్వాసం రా కుక్కకున్నట్టు నేను ఎంత డబ్బు ఇచ్చాను. అదంతా వదిలేసి వదిలేసి దీపమ్మ.. దీపమ్మ అంటారు ఏంటిరా ఛీ.. దీనమ్మ జీవితం. దాని మొగుడు వదిలేస్తే జరిగినప్పుడు నిజంగా నీకు అంత అభిమానమే ఉంటే కార్తీక కాలర్ పట్టుకొని హిమను చంపింది నేనేనని ధైర్యంగా ఎందుకు చెప్పలేదు. మీరంతా మంచివాళ్లే అని కార్తీక్ నమ్మితే.. నేను ఎందుకు ఇన్ని ఆట ఆడతాను ఛీ.. ఏం బతుకు రా మీది మంచి పేరు తెచ్చుకుని ఏం సాధిస్తున్నారా.. మీరందరూ అంటూ అంజితో గొడవ పడుతుంది. ఇదంతా కిటికీలోనుంచి దీప ఫోన్ లో రికార్డు చేస్తూ ఉంటుంది.

నీ జీవితంలో ఎన్ని రోజులకు ఒకే ఒక మంచి పని చేశావు ఒకే కారులో కార్తీక్ హిమ ఉన్నప్పటికీ హిమను మాత్రమే చంపి కార్తీక్ చనిపోకుండా యాక్సిడెంట్ మాత్రమే బాగా చేశావంటూ అంటుంది. అదొక్కటే నువ్వు నాకు చేసిన ఫేవర్. అయినా చంపించిన నేను ఎంత నేరస్తురాలో చంపిన నువ్వు కూడా అంతే నేరస్తుడు. నువ్వు ఏదో పవిత్రమూర్తి అన్నట్టూ మాట్లాడుతున్నావ్ ఏంటి రా. చూడు నువ్వు ఎంత క్రూరమైనవాడో నేను కూడా అంతే.. కాబట్టి మనం మనం గొడవ పడడం అనవసరం. నువ్వు నాతో వస్తావా.. రావా అని అడుగుతుంది. నాకు నిద్ర వస్తుంది. రేపే నా పెళ్లి.. నిద్రపోకపోతే నా గ్లామర్ దెబ్బతింటుంది. రా నాతో రా అంటూ అంజి చేయి పట్టుకోగా ఇప్పుడు జుట్టు అందిందా.. అంటూ అంజి మాట్లాడుతాడు.

ఇందాక కాళ్లు పట్టుకున్నావా… నువ్వు ఎంత నటన చేసిన నేను నమ్మలేదు. ఎందుకు ఇందుకే.. నువ్వు ఎక్కువ సేపు నటించలేవే. నీ లోనుంచి నీ ఒరిజినల్ పిశాచి వెంటనే బయటకు వస్తుంది నీతో నేను వచ్చేది..నిన్ను ఇప్పుడే లాక్కెళ్లి డాక్టర్ బాబు ..దీప ముందు పడేసి అంటూ మోనితను లాక్కుని వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మోనిత గన్ను తీసి అంజికి గురి పెడుతుంది. గన్ను గురు పెడుతూ దీపమ్మ.. దీపమ్మ భజన చేస్తావు కదా..నీ దీపమ్మ కోసం నీ దీపాన్ని ఆరుపుకో అంటూ అంజిని బెదిరిస్తుంది. దీపమ్మకోసం చచ్చిపో… నేను కార్తిక్ ని వదలడం ఏంటిరా.. అది ఈ జన్మలో జరగదు.

మా పెళ్ళికి నీ పేరును అడ్డు పెట్టి నా పెళ్లి ఆపాలని చూస్తుంది దీప. నా పెళ్లికి ముందు నిన్ను చంపి ఆ కేసు నా మెడకు చుట్టుకుని నా మెడలు మూడుముళ్ళు పడకుండా ఆగిపోతుందని నేను ఆగిపోతున్నాను. కానీ అడ్డు తిరిగితే మాత్రం. నిన్ను ఇప్పుడే ఇక్కడే తూట్లు తూట్లు పడేలా కాల్చిపారేస్తా అని బెదిరిస్తుంది. అప్పుడు అంజి మాట్లాడుతూ.. ఎంత తెలివి నీకు నావల్ల ప్రమాదముందని నన్ను వెతుక్కుంటూ వచ్చావా.. అంటే దీపమ్మ వల్ల ఏదైనా ప్రమాదం ఉందని ఆమెను కూడా ఏమైనా చేసావా అని అంజి అంటాడు.

అప్పుడు మోనిత అవన్నీ నీకు అనవసరం. ఎవరిని ఎప్పుడు ఎలా అడ్డు తప్పించాలో నాకు బాగా తెలుసు. హిమను నీతో ఎలాగైతే చంపించానో నిన్ను కూడా వేరే వాళ్ళతో అలాగే చంపిస్తా. ఇప్పుడు నిన్ని బలివ్వడానికి వచ్చాను. రేయ్.. ద్రాక్షారామం అంటూ ఒక వ్యక్తిని పిలుస్తుంది. రారా.. వీన్ని తాళ్లతో కట్టి డిక్కీలో పడేయి. నేను చెప్పే వరకు వీడిని ప్రాణాలతోనే ఉంచు అంటూ ద్రాక్షారామం కి చెబుతుంది… అప్పుడే దీప అక్కడ ఉన్న విషయం గమనించిన అంజి కాస్త ధైర్యంతో ఉంటాడు. అప్పుడు మోనిత ఏరా గొంతు మూగబోయిందని అంటుంది. రివాల్వర్ తగలగానే ప్రాణాలపై ఆశ పుట్టిందా… పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది వీడికి అంటూ అంజనీ అక్కడినుంచి తీసుకువెళుతుంది.

ఇక కార్తీక దీప గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండగా.. వారణాసి అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతాడు. ఈ టైంలో రమ్మని ఫోన్ చేశారు అంటూ కంగారు పడతాడు. ఎవరికీ ఏమైంది అని అడగగా ఎవరికీ ఏం కాలేదు.. నువ్వు టెన్షన్ పడకుండా ముందు ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ బాటిల్ ఇస్తాడు.నీళ్లు తాగిన తర్వాత వారణాసి చెప్పండి డాక్టర్ బాబు ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు.. దీపకి నువ్వు తోడబుట్టిన తమ్ముడు కన్నా ఎక్కువ. కష్టాల్లో నువ్వు తనకు తోడుగా ఉన్నావు. ఏ కష్టమొచ్చినా నీతో చెప్పేది మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో చెప్పు అంటూ వారణాసి ను అడుగుతాడు.

మీతో చెప్పలేదా అంటూ వారణాసి అడగగా… నాతో చెప్పిన చోటకి వెళ్ళలేదు అందుకే నిన్ను అడుగుతున్నా అంటూ చెబుతాడు. నాకు కూడా తెలియదు. అక్క నిజంగా ఎక్కడికి వెళ్ళిందో.. అడిగితే వచ్చాక చెబుతా లేరా అంటూ వెళ్ళింది అని వారణాసి చెప్పగా నమ్మాలా… అంటూ డాక్టర్ బాబు అంటాడు ఒట్టు బాబు నాకు నిజంగానే తెలియదు..ఈవేళలో ఒక్కటే వెళ్లి ప్రమాదం తెచ్చుకుంటుందని భయం వేస్తుంది తెలిస్తే నిజం చెప్పురా అంటూ బతిమాలాడు. అప్పటికి వారణాసి తెలియదని చెబుతాడు.ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉందా అని అడగగా ఉంది అంటే వెంటనే ఫోన్ చేసి అడుగు ఎక్కడ ఉందో అని చెబుతాడు. వారణాసి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో వారణాసి అక్కడినుంచి వెళ్ళమంటాడు.

కట్ చేస్తే దీప తిరిగి హైదరాబాద్ వస్తుంది.కారులో వస్తూ మోనిత హిమకు యాక్సిడెంట్ చేసిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది. అప్పుడు డ్రైవర్ వెంకట్ ఏంటి అక్క.. కారెక్కినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావ్ ..అని అడగగా ఏంలేదులేరా అంటూ దీప సమాధానం చెబుతుంది. ఏంటో అక్క ఫస్ట్ విజయవాడ వెళ్దాం అన్నావ్ తరువాత.. ఆవిడ ఎక్కింది. ఆవిడ సూర్యాపేటలో దిగగానే నువ్వు కూడా నా ఫోను తీసుకెళ్లి అదే హోటల్ కి వెళ్లావు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అక్క అంటూ వెంకట్ అనగా…నాక్కూడా ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదురా అంటూ సమాధానం చెబుతుంది.సరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు డాక్టర్ బాబు కంగారు పడుతూ ఉంటాడు ఫోన్ చేస్తాను అంటే స్విచ్ ఆఫ్ అయింది అక్క.. కంగారులో రావడంతో చార్జర్ తెచ్చుకోవడం మర్చి పోయాను అంటూ సమాధానం చెప్తాడు.

ఇక తెల్లవారగానే ఉదయం ఇంటికి వెళ్ళిన మోనిత ప్రియమణి గీజర్ ఆన్ చెయ్ అని చెబుతుంది. చేశానమ్మ అంటూ రాత్రి కార్తీక్ బాబు వచ్చాడని చెప్పగానే మోనిత కంగారు పడుతుంది ఎందుకు వచ్చాడని అడగగా తెలియదమ్మా మిమ్మల్ని అడిగారు లేదని చెప్పగానే వెళ్ళిపోయాడు అని సమాధానం చెబుతుంది. మీ జీవితం చేజారి పోకుండా చూసుకోండి అని ప్రియమణి అని వెళ్లగా మోనిత కంగారు పడుతుంది.అంతా నాకు అనుకూలంగానే ఉందనుకున్నాను కానీ ఏదో అపశృతి దొరుకుతుంది. కార్తిక్ ఎందుకు వచ్చాడని ఆలోచిస్తుంది.మరోవైపు కార్తిక్ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లలు లేచేలోగా వస్తానని ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక దీప ఇంటికి రావడంతో కార్తీక్ ఎక్కడికి వెళ్ళావ్ అంటూ ప్రశ్నిస్తాడు.

మీ పిన్ని ఇంటికి అని చెప్పి వెళ్ళావ్.. ఆమె ఫోన్ చేసి దీప ఉందా అని అడిగింది.అసలు ఎక్కడికి వెళ్ళావ్ చెప్పకుండా. మీ పిన్ని ఇంటికి వెళ్లకుండా ఫోన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్లావోనని రాత్రంతా నీకోసం పిచ్చోడిలా రోడ్లపై తిరుగుతున్నా అంటూ దీపను ప్రశ్నిస్తాడు అసలేం జరిగింది ఎక్కడికి వెళ్లావు అని అడగగా…బ్రష్ చేసి రండి డాక్టర్ బాబు వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్తుంది.అదేవిధంగా భాగ్యం ఎలాగైనా పెళ్లి ఆపాలని మోనితను కిడ్నాప్ చేయాలని తన ఇంటికి వెళ్లి కథలు చెబుతుంది. రాత్రి నుంచి అంజి కార్తీక్ దగ్గరే ఉన్నాడు అని చెప్పడంతో ఆమె ఏదో ప్లాన్ చేసిందని పసిగట్టిన మోనిత తనకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

యూట్యూబ్ లో తన సత్తా ఏంటో చూపిస్తున్న.. కార్తీకదీపం మోనిత!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు తెలిసిందే. ఈ సీరియల్ లో దీప పాత్ర తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే పాత్ర ఏదైనా ఉంది అంటే అది మోనిత పాత్రని చెప్పవచ్చు. సీరియల్ లో నెగటివ్ పాత్రలో కనిపించే మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమెది స్వస్థలం బెంగళూరు. అసలు పేరు శోభా శెట్టి అయినప్పటికీ ఈమెను చాలామంది మోనితగానే గుర్తు పెట్టుకున్నారు.

ఇక అందరు టీవీ సెలబ్రిటీల మాదిరిగానే మోనిత కూడా గత కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మోనిత చేసింది కేవలం మూడే మూడు వీడియోలు. ఒకటి తన హోమ్ టూర్, రెండవ వీడియో మంత్రాలయం టూర్,మూడవ వీడియో కార్తీకదీపం సీరియల్ లో శ్రీ రామ్ నగర్ బస్తీలో దీప నివస్తున్నటువంటి ఇంటిని వంటలక్క హోమ్ టూర్ అంటూ మూడు వీడియోలను చేసింది.

మోనిత చేసిన ఈ మూడు వీడియోలు ఒక్కొక వీడియో 1 మిలియన్ వ్యూస్ ను సాధించాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో వంటలక్క హోమ్ టూర్ ట్రెండింగ్ అవుతోంది. ఈ విధంగా మోనిత సీరియల్ లో మాత్రమే కాకుండా.. తన యూట్యూబ్ ఛానల్ లో కూడా తన దూకుడును ప్రదర్శిస్తోందని చెప్పవచ్చు.

ఇక తెలుగులో మాత్రమే కాకుండా శోభా శెట్టి అలియాస్
మోనిత కన్నడలో పలు సీరియల్స్, సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.మోనిత దూకుడు ఈ విధంగానే ఉంటే రికార్డులు సృష్టించడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.