Monitha: తెలుగు బుల్లితెరపై విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకొని అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ లో దీప కార్తీక్ పాత్రలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని దీప కోసమే చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సీరియల్ లో మోనిత పాత్రకు కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.
ఈ విధంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో దీప, కార్తీక్ అలాగే మోనిత పాత్రలను ఈ సీరియల్ నుంచి తొలగించారు. ఇందులో దీప కార్తీక్ లను చనిపోయినట్టు చూపించగా మోనిత మాత్రం కార్తీక్ చనిపోయారన్న బాధలో తన కొడుకును సైతం వదిలి వెళ్ళిపోయినట్టు చూపించారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ లో హిమ సౌర్య పెద్దగా అవ్వడం వారి ప్రేమ కథతో నడుస్తుంది.
ఈ విధంగా ఈ సీరియల్లో కొత్త పాత్రలు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే ఏదో ఒక రూపంలో తిరిగి కార్తీక్, దీప,మోనిత పాత్రలను తీసుకువస్తే బాగుండేదని పెద్ద ఎత్తున అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో విలన్ పాత్రలో నటించిన మోనిత తిరిగి ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పరోక్షంగా మోనిత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను కార్తీకదీపం సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని పోస్ట్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె మాట్లాడుతూ చాలామంది అభిమానులు నన్ను కార్తీక దీపంలోకి రీ ఎంట్రీ ఇవ్వమని అడుగుతున్నారు. రావాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను. నాకైతే ఈ సీరియల్ లోకి రావాలని ఉంది.అయితే ఈ విషయం గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తా అంటూ ఈ సందర్భంగా ఈమె కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…