Dosa King Movie: సూర్య హీరోగా తమిళ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ఓ దళిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాటం చేసింది తనకు లాయర్ చంద్రు ఏ విధంగా సహాయం చేశారు అనే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా ఎలాంటి మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో కూడా నిలబడింది. ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు వివాదాలలో కూడా చిక్కుకుంది.ఇకపోతే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకులను సందడి చేసిన డైరెక్టర్ జ్ఞానవేల్ మరొక నిజజీవిత కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమాని దర్శకుడు తమిళ తెలుగు భాషలలో కాకుండా హిందీలో దోశ కింగ్ అనే సినిమా చేయబోతున్నారు. శరవణ భవన్’ పి.రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు హోటల్లు దేశ విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.అయితే ఈయనకు జోస్యం పిచ్చి కారణంగా ఓ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా తన దగ్గర మేనేజర్ గా పని చేసే వ్యక్తి కుమార్తె జీవజ్యోతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.
ఈ క్రమంలోనే అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన రాజగోపాల్ తనని మూడో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా దారుణంగా సినిమా స్టైల్ లో చంపించారు. దీంతో జీవ జ్యోతి తనపై న్యాయం కోసం 18 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి గెలిచింది. అయితే ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ కష్టాలను ఆమె ఏ విధంగా ఎదుర్కొని ఈ కేసు గెలిచిందనే కథాంశంతో జ్ఞానవేల్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…