Tag Archives: smartphone

మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

ఈ మధ్య కాలంలో ఫోన్లు పేలిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో వినియోగదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే ఫోన్లు పేలడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్లు పేలకుండా జాగ్రత్త పడవచ్చు. మొబైల్ ఫోన్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే అపాయమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్లు వాడకూడదని సూచిస్తున్నారు.

మొబైల్ ఫోన్ ను ఎప్పుడూ 96 శాతం కంటే ఎక్కువగా ఛార్జ్ చేయకూడదని అదే సమయంలో 20 శాతం కంటే ఛార్జింగ్ తక్కువగా ఉండకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ కు ఎప్పుడూ కంపెనీ ఛార్జర్ నే వాడాలని ఒకవేళ కంపెనీ ఛార్జర్ పాడైతే ఖర్చు ఎక్కువైనా కంపెనీ ఛార్జర్ నే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మార్కెట్ లో తక్కువ ధరకు దొరికే ఛార్జర్లను కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు.

మొబైల్ ఫోన్ లో అవసరం లేని అప్లికేషన్లు ఉంటే వీలైనంత త్వరగా తొలగించాలని.. అనవసరమైన యాప్స్ సైతం పలు సందర్భాల్లో మొబైల్ ఫోన్లు పేలడానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ తీసిన వెంటనే హెవీ గేమ్స్ ఆడకూడదని.. వీడియో కాల్స్ చేయకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ బ్యాటరీ సమస్యలు వస్తే జెన్యూన్ బ్యాటరీనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

ఫోన్ వర్షంలో తడిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరబెట్టాలని సర్వీసింగ్ చేయించిన తరువాతే ఫోన్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కేరళలో ఒక వ్యక్తి దిండు కింద ఫోన్ పెట్టుకున్న సమయంలో ఫోన్ పేలి గాయాలయ్యాయి. ఫోన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

జియో సంచలన నిర్ణయం.. 2,500 రూపాయలకే స్మార్ట్ ఫోన్..?

దేశీయ టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జియో రాకతో దేశంలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఒకప్పుడు 1 జీబీ డేటా కోసం 100 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో తక్కువ ధరకే ఉచిత కాల్స్, డేటాకు ఛార్జీలను వసూలు చేస్తూ టెలీకం రంగంలో అంతకంతకూ ఎదుగుతోంది. అనంతరం జియో ఫోన్ల ద్వారా టెలీకాం రంగంలో జియో మరో సంచలనం సృష్టించింది.

ఫీచర్ ఫోన్లు అయిన జియో ఫోన్లలో కూడా వాట్సాప్, యూట్యూబ్ లను అందుబాటులోకి తెచ్చి జియో ఫీచర్ ఫోన్ల విక్రయాల్లో ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ మార్కెట్ ను సొంతం చేసుకుంది. రోజురోజుకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జియో మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలోనే జియో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ స్మార్ట్ ఫోన్ ధర అందరూ 4,000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని భావించారు. అయితే జియో మాత్రం అంతకంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం. జియో కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ జియో సంస్థ 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపు ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.
అయితే అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది.

2,500 నుంచి 3,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తే ఇతర స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై జియో స్మార్ట్ ఫోన్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అతి త్వరలో జియో స్మార్ట్ ఫోన్ ప్రజలకు అందుబాటులోకి రానుందని సమాచారం.