ఈ మధ్య కాలంలో ఫోన్లు పేలిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో వినియోగదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే ఫోన్లు పేలడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్లు పేలకుండా జాగ్రత్త పడవచ్చు. మొబైల్ ఫోన్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే అపాయమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్లు వాడకూడదని సూచిస్తున్నారు.
మొబైల్ ఫోన్ ను ఎప్పుడూ 96 శాతం కంటే ఎక్కువగా ఛార్జ్ చేయకూడదని అదే సమయంలో 20 శాతం కంటే ఛార్జింగ్ తక్కువగా ఉండకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ కు ఎప్పుడూ కంపెనీ ఛార్జర్ నే వాడాలని ఒకవేళ కంపెనీ ఛార్జర్ పాడైతే ఖర్చు ఎక్కువైనా కంపెనీ ఛార్జర్ నే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మార్కెట్ లో తక్కువ ధరకు దొరికే ఛార్జర్లను కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ లో అవసరం లేని అప్లికేషన్లు ఉంటే వీలైనంత త్వరగా తొలగించాలని.. అనవసరమైన యాప్స్ సైతం పలు సందర్భాల్లో మొబైల్ ఫోన్లు పేలడానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ తీసిన వెంటనే హెవీ గేమ్స్ ఆడకూడదని.. వీడియో కాల్స్ చేయకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ బ్యాటరీ సమస్యలు వస్తే జెన్యూన్ బ్యాటరీనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.
ఫోన్ వర్షంలో తడిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరబెట్టాలని సర్వీసింగ్ చేయించిన తరువాతే ఫోన్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కేరళలో ఒక వ్యక్తి దిండు కింద ఫోన్ పెట్టుకున్న సమయంలో ఫోన్ పేలి గాయాలయ్యాయి. ఫోన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…