కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశవ్యాప్తంగా పంటలు పండించిన రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలను కేంద్రం కొనుగోలు చేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. కేంద్రం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పంట సేకరణ చేస్తోంది.
గతేడాదితో పోలిస్తే 19.42 శాతం ఎక్కువగా రైతుల నుంచి కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం ఇప్పటివరకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి 243 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కేంద్రం కొనుగోలు చేసిన ధాన్యంలో 171 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంజాబ్ రాష్ట్రం నుంచే కొనుగోలు చేయడం గమనార్హం. పంజాబ్ తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
45,900 కోట్ల రూపాయలు కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేసిందని తెలుస్తోంది. 20 లక్షలకు పైగా రైతులకు కేంద్రం మద్దతు ధరల నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూర్చింది. వరి, వేరుశనగ, సోయాబిన్ లాంటి ధాన్యాలను కేంద్రం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇతర పంటలను కూడా కేంద్రం రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా, లాక్ డౌన్ సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కేంద్రం రైతుల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత స్కీమ్ లను ప్రవేశపెడుతూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. పలు పథకాల ద్వారా కేంద్రం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…