Tag Archives: Sowmya Rao

Sowmya Rao: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ అంటూ తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న సౌమ్యరావు!

Sowmya Rao: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి సౌమ్య రావు ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె యాంకర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సౌమ్యరావు నిజజీవితంలో ఎంతో విషాదం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన తల్లిని కోల్పోయిన సంఘటన గురించి గత మాతృ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.

తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ చివరి క్షణాలు చాలా నరకం అనుభవించిందని ఈమె తన తల్లి పడినటువంటి కష్టాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈమె తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తాజాగా బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమెకు హైపర్ ఆది తన తల్లి జ్ఞాపకార్థం ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చారు.

Sowmya Rao: జ్ఞాపక శక్తి తగ్గిపోయింది..


ఇక ఆ ఫోటోని స్టేజ్ పై చూసినటువంటి సౌమ్యరావు అక్కడే పెద్ద ఎత్తున కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.తన తల్లి ఒకరోజు తలనొప్పితో బాధపడుతూ ఉండగా తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాము అయితే అది బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి షాక్ అయ్యామని తెలిపారు. అప్పటి నుంచి తాను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారని క్రమక్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చారని తెలిపారు. ఇక చివరికి తన తల్లి తనని కూడా గుర్తించలేకపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

Sowmya Rao: అలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు…ఎమోషనల్ అయిన యాంకర్ సౌమ్య రావు…?

Sowmya Rao: జబర్థస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మొదట బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ నటించి ప్రేక్షకులకు దగ్గరైన సౌమ్య రావు అనూహ్యంగా జబర్థస్త్ యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. జబర్థస్త్ షో లో వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ అందరి మీద సెటైర్ లు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ఇదిలా ఉండగా ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా సౌమ్యరావు తన తల్లిని దలుచుకుంటూ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. సౌమ్య రావు తల్లి క్యాన్సర్ సమస్యతో బాధపడుతు మరణించింది. ఆమె ఆఖరి రోజుల్లో పడిన కష్టాలు తలుచుకుని భావోద్వేగానికి గురైంది సౌమ్య.

ఈ క్రమంలో చివరి రోజుల్లో తన తల్లి అనుభవించిన నరకయాతన గురించి వివరిస్తూ.. అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడంటూ కన్నీటి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోలో తన తల్లి గురించి మాట్లాడుతూ..” అమ్మంటే నాకు ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యింది. అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని నేను మొక్కని దేవుడు లేడు. వెళ్లని గుడి లేదు. అమ్మ ఆరోగ్యం కోసం ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Sowmya Rao: క్యాన్సర్ తో మరణించిన తల్లి…


అయినా దేవుడు మా మీద దయ చూపించ లేదు. దేవుడు ఎందుకు నా పట్ల ఇంత నిర్దయగా ప్రవర్తించి అమ్మను నాకు దూరం చేసాడనీ బాధ పడని రోజు లేదు. . అందరూ అమ్మ ఫోటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే, నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడిన బాధే జ్ఞాపకం వస్తుంది’’ అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతూ సౌమ్యకి దైర్యం చెబుతున్నారు.