Sowmya Rao: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి సౌమ్య రావు ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె యాంకర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సౌమ్యరావు నిజజీవితంలో ఎంతో విషాదం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన తల్లిని కోల్పోయిన సంఘటన గురించి గత మాతృ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.
తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ చివరి క్షణాలు చాలా నరకం అనుభవించిందని ఈమె తన తల్లి పడినటువంటి కష్టాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈమె తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తాజాగా బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమెకు హైపర్ ఆది తన తల్లి జ్ఞాపకార్థం ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇక ఆ ఫోటోని స్టేజ్ పై చూసినటువంటి సౌమ్యరావు అక్కడే పెద్ద ఎత్తున కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.తన తల్లి ఒకరోజు తలనొప్పితో బాధపడుతూ ఉండగా తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాము అయితే అది బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి షాక్ అయ్యామని తెలిపారు. అప్పటి నుంచి తాను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారని క్రమక్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చారని తెలిపారు. ఇక చివరికి తన తల్లి తనని కూడా గుర్తించలేకపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…