Tag Archives: street vendors

తక్కువ వడ్డీకే కేంద్రం నుంచి రుణాలు.. ఈ పథకంతో 50 లక్షల మందికి లబ్ధి.. ?

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో.. వీధి వ్యాపారస్తులు ఎక్కువగా వైరస్ కాటుకి బలైపోయారు. లాక్‌డౌన్ సమయంలో వారి వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పీఎం స్వనిధి పథకం కింద వారంతా తమ సొంత వ్యాపారం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి వీధి వ్యూపారుల ఆత్మ నిర్భర నిధి (PM Street Vendor’s AtmaNirbhar Nidhi( PM SVANidh i) కింద రుణాలు పంపిణీ చేస్తున్నారు.

రూ.10,000 వరకు రుణాన్ని సులభంగానే పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌ను 2020జూన్‌ 1న ఆత్మ నిర్భర్‌ నిధి పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించిన ప్రధాని… వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రుణ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ప్రయోజనాలను వారికి వివరించారు. కరోనా వల్ల తాము ఎంతలా నష్టపోయింది… వీధి వ్యాపారులు ప్రధాని మోదీకి వివరించారు. ఈ పథకం తమకు ఎంతో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

జూలై 26, 2021 నాటికి 43.1 లక్షల రుణ దఖాస్తులు రాగా, వీటిలో 25.2 లక్షల రుణాలు మంజూరు కాగా, అందులో రూ. 2,243 కోట్ల రుణాలు 22.7 లక్షల మందికి పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన ఈ పథకం కోసం రూ.5000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ రుణం కోసం, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల రసీద లేదా చెల్లింపుపై కూడా నెలవారీ క్యాష్‌బ్యాక్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అసలు స్వనిధి పథకం అంటే ఏంటంటే.. రోడ్ సైట్ బండి లేదా వీధి రహదారిపై దుకాణాలను నడిపే వారికి ఇది వర్తిస్తుంది.

పండ్లు-కూరగాయలు, లాండ్రీ, సెలూన్, పాన్ షాపులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీని ద్వారా దాదాపు 50 లక్షల మందికి ప్రయోజనం చేకురనుంది. దీని ద్వారా ప్రతీ ఒక్క వ్యాపారి రూ.10000 వేలు రుణం తీసుకోవచ్చు. దీనిని ఒక సంవత్సరం లోపు చెల్లించాలి. ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. అంతేకాకుండా వడ్డీని సకాలంలో చెల్లిస్తూ ఉంటే.. 7% వార్షిక వడ్డీ రాయితీ కూడా ఉంటుంది.

వీధివ్యాపారులకు కేంద్రం శుభవార్త.. రేపే రూ.10,000 పంపిణీ..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వీధివ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఆత్మ నిర్భర భారత యోజన స్కీమ్ కింద వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటినుంచి కేంద్రం వీధివ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలను అందించనుంది. ప్రధాని మోదీ దాదాపు ముడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారితో మోదీ నేరుగా మాట్లాడనున్నారు

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని వీధివ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల లక్షల సంఖలో వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. అన్ లాక్ సడలింపులు అమలు చేసిన సమయంలో సైతం వీధివ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలామంది వీధివ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పులపై ఆధాపడ్డారు. కేంద్రం వీధి వ్యాపారుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్‌ మంత్రి స్ట్రీట్ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

పీఎం నరేంద్ర మోదీ జూన్ నెల 1వ తేదీన ఈ స్కీమ్ ను ప్రకటించారు. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ కొరకు 24 లక్షల మంది వీధివ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి రుణాలు ఇవ్వనుందని తెలుస్తోంది.

5.35 లక్షల మందికి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని.. మిగిలిన వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ నుంచి ఈ స్కీమ్ కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. 5,57,000 మంది ఉత్తరప్రదేశ్ వీధివ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. పీఎం తమకు ప్రయోజనం చేకూరేలా స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటంపై వీధివ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.