Tag Archives: sumalatha

మోహన్ బాబుతో నటించవద్దని నాకేవరూ చెప్పలేదు: నటి సుమలత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు మాటతీరు కఠినంగా ఉంటుందని ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం ఎంతో మంచిది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు గురించి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అతను మహా కోపిష్టి అని,అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరోయిన్లు ముందుకు రారు అనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగేది.

ఈ క్రమంలోనే అప్పటి నటి సుమలతకి మోహన్ బాబు సరసన నటించే అవకాశం వస్తే ఆమెకు కొందరు స్నేహితులు మోహన్ బాబుతో నటించవద్దని చెప్పారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.అయితే గత కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమలత ఈ విషయం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుతో సినిమా అవకాశాలు రావడం వల్ల అతనితో కలిసి నటించవద్దని తనకు ఎవరూ చెప్పలేదనే ఈ విషయాన్ని సుమలత ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

అదేవిధంగా మోహన్ బాబు గురించి మాట్లాడుతూ నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల లో మోహన్ బాబు కూడా ఒక మంచి స్నేహితుడు అని, ఇండస్ట్రీలో సినిమాలలో నటించక ముందే మోహన్ బాబు తన భర్త అంబరీష్ ఇద్దరూ మంచి స్నేహితులని ఆ విధంగా మోహన్ బాబు వ్యక్తిత్వం నాకు తెలుసు అనే విషయాన్ని ఈ సందర్భంగా సుమలత వెల్లడించారు.

ఇప్పటికి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు ఏదైనా అవసరమైతే ముందుగా మోహన్ బాబు కి ఫోన్ చేస్తాననే విషయాన్ని కూడా తెలియజేశారు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగితే అతని కుటుంబం రావడం మోహన్ బాబు ఇంట్లో శుభకార్యాలకు మేము వెళ్లడం జరుగుతుందని మా రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలిపారు.

అంబరీష్ మృతి చెందిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల పోటీలోకి దిగిన సుమలత కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ మోహన్ బాబు ట్వీట్ చేశారంటూ సుమలత మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలిపారు. ప్రస్తుతం సుమలత మాండ్య లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆ స్టార్ హీరోయిన్ తో నాగార్జునకు పెళ్లి ప్రపోజల్.. కానీ అప్పుడు ఏమైందంటే..!

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకు శివ సినిమా తర్వాత ఎక్కవ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన విషయం తెలిసిందే. అతడికి అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. మ‌న్మ‌థుడుతో అమ్మాయిల గుండెల్లో ఓ రొమాంటిక్ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో క్లాస్ సినిమా, రొమాంటిక్ సినిమాలో నాగార్జునకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. నాగార్జున మొదట డి. రామానాయుడు కూతురు శ్రీల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు.

ఆమెతో విడాకులు తీసుకున్న అనంతరం నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఓ హీరోయిన్ ను తన కుమారుడిని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టేవాడట. ఆమె ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సుమలత. సినిమా షూటింగ్ లో సరదాగా ఆమెను ఓ రోజు అడిగాడట.

ఏమ్మా.. సుమలత.. నీ కోసం ఓ అబ్బాయిని చూశాను.. పెళ్లి చేసుకుంటావా… అతడు అమెరికాలో చదువుకున్నాడు.. అందంగా ఉంటాడు అని చెప్పాడట. అయితే దానికి సుమలత ఆత్రుతగా ఎవరు సార్.. అంటూ అడగ్గా.. ఎవరో కాదు.. మా అబ్బాయి.. నాగార్జున అని చెప్పాడట.

దీంతో ఆమె సిగ్గుతో మెలికలు తిరుగుతూ అక్కడ నుంచి వెళ్లిపోయేదట. ఆ తర్వాత ప్రతీ ఒక్కరూ ఈ విషయం గురించే మాట్లాడుకునే వారట. అప్పట్లో ఇదొక సంచలనంగా మారిందని సమలత ఎన్నో సార్లు చెప్పింది. ఇలా నాగార్జునకు పెళ్లి కాకముందే ఏఎన్నార్ ఓ సంబంధం చూశాడని .. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

డ్యామ్ లీకవుతుంటే సుమలతను అడ్డంగా పడుకోబెట్టాలంటూ .. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం!

కర్ణాటకలోని కృష్ణ రాజ సాగర్ జలాశయానికి పగుళ్ళు ఏర్పడ్డాయని… డ్యామ్ చుట్టుపక్కల అక్రమ మైనింగ్ కారణంగానే డ్యామ్ పగుళ్ళు ఏర్పడుతోందని మాండ్య ఎంపీ, నటి సుమలత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నటి సుమలత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆమెపై నోరుజారి తీవ్ర చిక్కుల్లో ఇరుక్కున్నారు.

కావేరి నదిపై కృష్ణరాజ సాగర్‌ (కేఆర్‌ఎస్‌) జలాశయం నుంచి నీరు లీకవుతుంటే అందుకు అడ్డుగా ఎంపీ సుమలతను పడుకోబెట్టాలని కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జలాశయం చుట్టుపక్కల అక్రమ మైనింగ్ కారణంగా జలాశయానికి పగుళ్లు ఏర్పడుతుంటాయని సుమలతను పలుమార్లు ఆరోపించడంతో జలవనరుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఎటువంటి పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చి చెప్పింది.

ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ అనవసరంగా జలాశయం లీక్ అవుతుంది అంటూ సుమలత ఆరోపించడం సబబు కాదని, జలాశయంలో లీకేజ్ అవుతుంటే నీరు లీకేజీ కాకుండా ఉండాలంటే స్లూయజ్ గేట్లకు అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలని నోరుజారారు. ఈ విధంగా ఒక మహిళ పట్ల బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈ విధంగా మాట్లాడటాన్ని ఎంపీ సుమలత తప్పుబట్టారు.

కుమారస్వామి ఎలాంటివారో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అతని మాటల వల్లే తెలుస్తుందని ఆమె మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేయడం తప్పు కాదు కానీ ఆ మాటలు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని సుమలత సూచించారు. ప్రాజెక్టు సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని అక్కడ లీకేజ్ జరిగేచోట ఆయనే పడుకోబెట్టాలి అంటూ ఆమె కౌంటర్ వేశారు.