Tag Archives: suresh

బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం గురించి ఎవరికి తెలియని నిజాలు.. మీరెప్పుడు చూడని ఫోటోలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారి కొడుకు. ఇలా స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీనివాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫోటోలను, తన ఫ్యామిలీ గురించి ఇక్కడ తెలుసుకుందాం…

బెల్లంకొండ శ్రీనివాస్ జనవరి 3 1993 లో గుంటూరులో జన్మించాడు. ఇతని స్కూల్, కాలేజ్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కాలిఫోర్నియాలోని లీస్టస్ బర్గ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్షణ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన శ్రీనివాసన్ ను తన తండ్రి సురేష్ ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి లాంచ్ చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 2014 సంవత్సరంలో “అల్లుడు శీను” సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు. ఇందులో సమంతా కథానాయికగా నటించిన ఈ సినిమాను స్వయంగా సురేష్ నిర్మించారు. మొదటి సినిమాతోనే ఎంతో హైప్ క్రియేట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సౌఖ్యం వంటి ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కమర్షియల్ హిట్ అందుకోలేదని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న “ఛత్రపతి” సినిమా బాలీవుడ్ రీమేక్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు గణేష్. గణేష్ కూడా త్వరలోనే వెండితెర ఆరంగ్రేటం చేయనున్నారు. గణేష్ హీరోగా “స్వాతిముత్యం” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

పాట‌లో రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోడానికి సురేష్ ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలుసా..!

శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ‘జ‌గ‌మొండి’ సినిమాలో సురేష్ మొదటి సారిగా నటించారు. ఇందులో అతడు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం స‌మ‌తా ఆర్ట్స్ రూపొందించారు. ఇక్కడ సురేష్ కు జోడీగా ‘శంక‌రాభ‌ర‌ణం’ రాజ్య‌ల‌క్ష్మి నటించారు. ఓ పాటను వీళ్లద్దరి మద్య ఊటీలో చిత్రీకరించారు. ఆ పాటలోనే సురేష్ మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నారు. అంతకముందు అతడికి నటనలో గానీ, నాట్యంలో గానీ ఎలాంటి అనుభవం కూడా లేదు.

అప్పటికే రాజ్యలక్ష్మి శంకరాభరణం చిత్రం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. త‌న‌కంటే సీనియ‌ర్ న‌టితో క‌లిసి పాట‌పాడుతూ, డాన్స్ చెయ్య‌డం అన‌గానే మొద‌ట్లో సురేష్ కు కొంచెం జంకు క‌లిగింది. వీరిద్దరి మధ్య జరిగే మొదటి దృశ్యంలో సురేష్ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోవాలి. అయితే దర్శకుడు మధుసూదనరావు చిత్రీకరణ కంటే ముందే రిహాసల్స్ చేయించారు.

రాజ్యలక్ష్మిని అతడు రిహాసల్స్ సమయంలో కూడా కౌగిలించుకోకుండానే మూవ్‌మెంట్స్ చూసుకొని మ‌ధుసూద‌న‌రావు ‘టేక్’ అన్నారు. తర్వాత సౌండ్ స్టార్ట్ అయింది. పాట మొదలైంది.. పురుగెత్తుకుంటూ వెళ్లి అతడు రాజ్యలక్ష్మిని కౌగిలించుకోవాలి. పెదాలు కదుపుతూ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోబోయే ముందు ఆగిపోయాడు సురేష్.

ఏమైంది.. కౌగిలించుకోకుండా ఆగిపోయావు ఏంటి.. అంటూ డైరెక్టర్ ప్రశ్నించారు. కెమెరామేన్‌, డైరెక్ట‌ర్‌, ఇత‌ర యూనిట్ మెంబ‌ర్స్ ముందు ఒక అమ్మాయిని కౌగిలించుకోవ‌డం అనేస‌రికి సురేష్ కు ఏదోలా అనిపించింది. సరే మళ్లీ మరో టేక్ అన్నట్లు చెప్పాడు.. ఇబ్బంది పడుకుంటూనే.. ఇలా ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. అయిదు.. ఆరు.. ఏడు.. ఇలా టేకులు తీశారు. డైరెక్టర్ అతడిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఎనిమిదో టేక్ లో ఓకె చేశారని ఓ సందర్భంలో సురేష్ తెలియజేశారు.

అప్పట్లో సురేష్-న‌దియా పెళ్ళి వరకూ వెళ్ళారా ? చివరకు ఏం జరిగిందంటే..!

సినిమాలో మొదటి నుంచి ఓ ఆనవాతీ వస్తోంది. ఇప్పటి జనరేషన్ వాళ్లే కాకుండా.. మొదటి జనరేషన్ వాళ్లు కూడా ఓ జంట సినిమాలో విజయవంతం అయ్యారంటే.. ఆ జంట గురించి గుసగుసలు, పుకార్లు చక్కెర్లు కొడుతుంటాయి. ఆ జంట న‌టించిన సినిమా స‌క్సెస్ అయ్యిందంటే వారికి హిట్ పెయిర్ అని పేరుపెట్టి, అదే జంట‌తో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించ‌డం పరిపాటిగా వచ్చేది.

ఇక ఆ జంటతోనే సినిమాలను తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కూడా కనబరుస్తారు. వీళ్లు ఇలా ఆలోచించడానికి కూడా ఓ కారణం ఉంది. ప్రేక్షకులు కూడా ఆ జంటనే మరోసారి చూడాలని అనుకుంటారు. దీంతో అలా పలు సినిమాలలో నటించి హిట్ సినిమా కొట్టిన జంటల గురించి పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించేవి. ఈ విధంగా పలు సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న జంటలలో సురేశ్‌, న‌దియా జంట‌ ఒకటి. వారిద్దరు కలిసి నటించిన ఒక త‌మిళ చిత్రం స‌క్సెస్ కావ‌డంతో.. వ‌రుస‌గా వారి కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. వాళ్లిద్ద‌రూ క‌లిసి ప్ర‌తి సినిమాలో కనిపిస్తుండ‌టం చూసి.. వాళ్లిద్ద‌రి మ‌ధ్య లేని సంబంధాన్ని సృష్టించి.. సురేశ్‌-న‌దియా పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అయితే వీటికి ఆజ్యం పోస్తూ అప్పట్లో తమిళ పత్రికలు కూడా వార్తలను ప్రచురించేవి. ఇలా వారిమధ్య ప్రేమ ఉందంటూ పుకార్లు షికార్లు అయ్యాయి. ఈ విషయంపై సురేశ్ ను అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. మీమిద్దం స్నేహితులం మాత్రమే.. మాకు అలాంటి ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి సురేశ్ తన పంథాను మార్చాడు. ఒకే హీరోయిన్ తో కాకుండా ఒక్కో సినిమాలో విభిన్న హీరోయిన్ లతో నటించడం మొదలు పెట్టాడు.

తర్వాత నదియా కాంబినేషన్ లో చేయడానికి అవకాశం వచ్చినా అతడు చేయలేదంట. ఇలా వదంతులు వస్తున్న క్రమంలోనే 1988లో శిరీష్ గాడ్‌బోలే అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకున్న నదియా.. తర్వాత అమెరికాకు వెళ్లిపోవడంతో వదంతులకు చెక్ పడింది. ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో తల్లి క్యారెక్టర్ తో పాటు మరికొన్ని సినిమాల్లో మెయిన్ రోల్ ఉండే పాత్రల్లోనటిస్తున్నారు.