హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలియజేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకి అప్పజెప్పారని శ్రీనివాస్ పేర్కొన్నారు.
కాగా పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కెసిఆర్ గొప్ప అవకాశం కల్పించారని శ్రీనివాస్ తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.