Tag Archives: Union Budget 2021

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. రూ.80 వేల వరకు ఆదా..?

కేంద్ర ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం కేంద్రం ఏకంగా 80 వేల రూపాయల వరకు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే దిశగా నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో బడ్జెట్ లో కీలక నిర్ణయాలకు చాన్స్ ఉండనుందని సమాచారం.

బడ్జెట్ 2021పై సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉద్యోగులు, వ్యాపారులు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచవచ్చని తెలుస్తోంది. సాధారణంగా స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ తగ్గింపు వల్ల పన్ను చెల్లింపుదారులకు అదనపు భారం తగ్గుతుంది. లక్ష రూపాయల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలని పన్ను చెల్లింపుదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఐఐ సైతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని చెబుతోంది. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రతికూల ప్రభావం పడిన నేపథ్యంలో 2020 – 2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు వెలువడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫిబ్రవరి 1 వరకు ఆగితే మాత్రమే ఊహాగానాలు నిజమో కాదో తెలిసే అవకాశాలు ఉంటాయి.

అయితే గత బడ్జెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కేంద్రం అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ లో అనేక మార్పులు చేసిందని అందరికీ ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేలా బడ్జెట్ ను రూపొందించిందని తెలుస్తోంది.

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఎకరాకు 7 వేల రూపాయలు..?

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయడంతో మోదీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

రైతుల ధర్నా వల్ల మోదీ సర్కార్ కు చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో కేంద్రం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. రైతులను బడ్జెట్ ద్వారా ఆదుకోవాలని కేంద్రం భావిస్తోందని.. పీఎం కిసాన్ స్కీమ్ నగదు పెంపుతో పాటు సోలార్ పంపు స్కీమ్ గడువును కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పీఎం కుసుమ్ స్కీమ్ కొరకు రెన్యూవబుల్ మినిస్ట్రీ గతంతో పోలిస్తే ఎక్కువగా నిధులను కేటాయించిందని.. ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున కేంద్రం పీఎం కుసుమ్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీ ధరకే పొందే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేయడం ద్వారా రైతులు సొంతంగా ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు.

సోలార్ ప్యానెల్స్ ను అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు అదనపు విద్యుత్ ను విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 లక్షల మంది రైతులు పీఎం కుసుమ్ యోజన స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందుతుండటం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ను అమలులోకి తెచ్చి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున ఇవ్వనుందని తెలుస్తోంది.