General News

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఎకరాకు 7 వేల రూపాయలు..?

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేయడంతో మోదీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

రైతుల ధర్నా వల్ల మోదీ సర్కార్ కు చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో కేంద్రం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. రైతులను బడ్జెట్ ద్వారా ఆదుకోవాలని కేంద్రం భావిస్తోందని.. పీఎం కిసాన్ స్కీమ్ నగదు పెంపుతో పాటు సోలార్ పంపు స్కీమ్ గడువును కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పీఎం కుసుమ్ స్కీమ్ కొరకు రెన్యూవబుల్ మినిస్ట్రీ గతంతో పోలిస్తే ఎక్కువగా నిధులను కేటాయించిందని.. ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున కేంద్రం పీఎం కుసుమ్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీ ధరకే పొందే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేయడం ద్వారా రైతులు సొంతంగా ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు.

సోలార్ ప్యానెల్స్ ను అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు అదనపు విద్యుత్ ను విక్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 లక్షల మంది రైతులు పీఎం కుసుమ్ యోజన స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందుతుండటం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ను అమలులోకి తెచ్చి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరాకు 7 వేల రూపాయల చొప్పున ఇవ్వనుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

6 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

6 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

6 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

6 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

6 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

6 hours ago