కేంద్ర ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం కేంద్రం ఏకంగా 80 వేల రూపాయల వరకు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే దిశగా నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో బడ్జెట్ లో కీలక నిర్ణయాలకు చాన్స్ ఉండనుందని సమాచారం.
బడ్జెట్ 2021పై సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉద్యోగులు, వ్యాపారులు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ను పెంచవచ్చని తెలుస్తోంది. సాధారణంగా స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ తగ్గింపు వల్ల పన్ను చెల్లింపుదారులకు అదనపు భారం తగ్గుతుంది. లక్ష రూపాయల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలని పన్ను చెల్లింపుదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఐఐ సైతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని చెబుతోంది. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రతికూల ప్రభావం పడిన నేపథ్యంలో 2020 – 2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు వెలువడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫిబ్రవరి 1 వరకు ఆగితే మాత్రమే ఊహాగానాలు నిజమో కాదో తెలిసే అవకాశాలు ఉంటాయి.
అయితే గత బడ్జెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కేంద్రం అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ లో అనేక మార్పులు చేసిందని అందరికీ ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేలా బడ్జెట్ ను రూపొందించిందని తెలుస్తోంది.
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…