Tag Archives: vizianagaram district

కింగ్ కోబ్రా హల్ చల్.. హడలిపోయిన అటవీశాఖ అధికారులు.. ఎక్కడో తెలుసా..?

సాధారణంగా పాములు అంటేనే ప్రతి ఒక్కరు భయపడతారు. అదే కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఏమైనా ఉందా.. తలుచుకుంటేనే ఒళ్లు ఝల్లుమంటోంది. ఇవి ఎక్కువగా జన సంచారం లేని అడవుల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మనుషులు తిరిగే ప్రదేశాల్లో కూడా పాములు కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం.

కొందరు వాటిని చంపుతుండగా.. మరికొందరు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి అప్పగిస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలం చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. కొన్ని రోజుల క్రితం అక్కడ ఏనుగులు బీభత్సం స్పష్టించగా అటవీ అధికారులు వాటిని మరో ప్రదేశానికి తరలించారు. అక్కడ ఉన్న ఏనుగులను గిరిజన గ్రామాల నుంచి అటవీ ప్రాంతంలోకి తరిమేయడానికి ప్రయత్నిస్తుండగా.. కింగ్ కోబ్రాపిల్ల పడగఎత్తి ఒక్కసారిగా బుసలు కొట్టింది.

దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. కింగ్ కోబ్రా పిల్ల ఇక్కడే ఉందంటే.. దాని తల్లి కూడా ఈ ఏరియాలోనే ఉండే ఉంటుందని.. కాసేపు ఆ ప్రాంతమంతా వెతికారు. కానీ ఎక్కడ దొరకలేదు. అయితే చిన్న కోబ్రా కనిపించిందంటే.. పెద్ద కోబ్రా కూడా ఇక్కడే ఉంటుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొందరపడి ఆ పాములను చంపడం కానీ హింసించడం కానీ చేయవద్దని స్థానిక ప్రజలను కోరారు. ఎవరికైనా ఇలాంటి సర్ప జాతులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే ఇక్కడ నివసించే ప్రజలకు మొదటి నుంచి ఇక్కడ కింగ్ కోబ్రా తిరుగుతుందనే అనుమానం ఉండేది. ఈ ఘటనతో అది బలపడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం కోసం ఆ గ్రామ గిరిజనుల వింత ఆచారం.. 60 ఏళ్ల నుంచి వినూత్న పూజలు..!

ఇది వర్షాకాలం. అయినా కొన్ని ఏరియాల్లో అనుకున్నంత మేర వర్షాలు కురవడం లేదు. దీంతో అక్కడ గ్రామస్తులు వర్షాలు కురవాలని.. వాన దేవుడికి పూజలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లోనే విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామంలో వర్షాలు కురవాలని.. రైతులు ఓ వింత ఆచారాన్ని పాటించారు. అందేంటో తెలుసుకుందాం..

విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. ఈ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాకరమ్మ కొండపై ఆరిలోవ నీళ్లసర్రి వద్ద కొండభైరవుడు, జాకరమ్మలకు పూజలు నిర్వహించారు. ఈ దేవుళ్లను పూజిస్తే వరుణుడు కరిణించి వర్షాలు పుష్కలంగా కురిపిస్తాడని ఇక్కడ రైతులకు, గ్రామస్తులకు నమ్మకం. మామూలుగా అయితే ఎవరైనా వన భోజనాలకు వెళ్లి అక్కడ భోజనం చేసి.. కుటుంభ్యులతో కాస్తంత సమయాన్ని కేటాయిస్తూ.. ఎంజాయ్ చేస్తారు.

అక్కడే నాన్ వెజ్ వండుకొని వన భోజనాన్ని ఆరగిస్తారు. ఇక్కడ కూడా వాళ్లు వారితో పాటు బియ్యం, బెల్లంతో పిల్లా పాపలతో కలిసి గుట్టపై కి వెళ్లారు. అక్కడ దేవుళ్లకు నైవేద్యం సమర్పించిచే ముందు మేకలను, గొర్రెలను అమ్మవారికి బలిచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. దేవుళ్లకు సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని కొండ రాయిపై వంతుల్లా వేస్తారు.

తర్వాత వాటిని మోకాళ్లపై కూర్చొని.. ఒక్కొక్కరు ఆ పరమాన్నాన్ని నాలుకతో నాకి తిన్నారు. ఇలా పూజ చేస్తేనే వర్షాలు కురుస్తాయనే గ్రామస్తులు నమ్ముతారు. ఇలాంటి ఆచారాన్ని గ్రామస్తులు గత 60 సంవత్సరాల నుంచి పాటిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం.

ఏపీ ప్రజలు బ్యాంకు ఖాతాల్లో వేల రూపాయలు జమ.. ఎవరేశారో తెలియదనంటున్న ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని కొందరి బ్యాంక్ ఖాతాలలో వేల రూపాయల నగదు జమవుతోంది. ఎవరు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలీదు కానీ భారీ మొత్తంలో నగదు జమవుతూ ఉండటంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన 200 మంది బ్యాంకు ఖాతాలలో 13,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు నగదు జమైంది.

ఆ నగదు ఎక్కడి నుంచి జమైందో ఎవరు జమ చేశారో తెలియదని తమకు సమాచారం అందలేదని అధికారులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు దర్యాప్తు జరిపితే మాత్రమే ఆ నగదు ఎవరు జమ చేశారో ఎక్కడి నుంచి జమైందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఎవరి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయో వాళ్లు డబ్బులు జమైనట్లు ఇతరులకు చెప్పడానికి ఇష్టపడటం లేదు.

డబ్బు జమైనట్లు చెబితే వెనక్కు తీసుకుంటారని కొందరు భయపడుతున్నారు. మరి కొందరు మాత్రం ఆ నగదు ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన నగదు అయ్యి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు. గ్రామంలో పొలం లేని వారి ఖాతాల్లో కూడా నగదు జమ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల నగదు జమకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు.

బ్యాంక్ అధికారులు డబ్బులు జమ కావడానికి గల కారణాన్ని పరిశీలిస్తామని.. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ నంబర్ కు ఆధార్ నంబర్ లింక్ కావడంతో డబ్బులు తప్పుగా జమయ్యే అవకాశం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ డబ్బులు పొరపాటున బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయా..? లేక ఎవరైనా కావాలని బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారా..? తెలియాల్సి ఉంది.