General News

ఏపీ ప్రజలు బ్యాంకు ఖాతాల్లో వేల రూపాయలు జమ.. ఎవరేశారో తెలియదనంటున్న ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని కొందరి బ్యాంక్ ఖాతాలలో వేల రూపాయల నగదు జమవుతోంది. ఎవరు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలీదు కానీ భారీ మొత్తంలో నగదు జమవుతూ ఉండటంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన 200 మంది బ్యాంకు ఖాతాలలో 13,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు నగదు జమైంది.

ఆ నగదు ఎక్కడి నుంచి జమైందో ఎవరు జమ చేశారో తెలియదని తమకు సమాచారం అందలేదని అధికారులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు దర్యాప్తు జరిపితే మాత్రమే ఆ నగదు ఎవరు జమ చేశారో ఎక్కడి నుంచి జమైందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఎవరి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయో వాళ్లు డబ్బులు జమైనట్లు ఇతరులకు చెప్పడానికి ఇష్టపడటం లేదు.

డబ్బు జమైనట్లు చెబితే వెనక్కు తీసుకుంటారని కొందరు భయపడుతున్నారు. మరి కొందరు మాత్రం ఆ నగదు ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన నగదు అయ్యి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు. గ్రామంలో పొలం లేని వారి ఖాతాల్లో కూడా నగదు జమ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల నగదు జమకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు.

బ్యాంక్ అధికారులు డబ్బులు జమ కావడానికి గల కారణాన్ని పరిశీలిస్తామని.. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ నంబర్ కు ఆధార్ నంబర్ లింక్ కావడంతో డబ్బులు తప్పుగా జమయ్యే అవకాశం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ డబ్బులు పొరపాటున బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయా..? లేక ఎవరైనా కావాలని బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారా..? తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago