ఇది వర్షాకాలం. అయినా కొన్ని ఏరియాల్లో అనుకున్నంత మేర వర్షాలు కురవడం లేదు. దీంతో అక్కడ గ్రామస్తులు వర్షాలు కురవాలని.. వాన దేవుడికి పూజలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లోనే విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామంలో వర్షాలు కురవాలని.. రైతులు ఓ వింత ఆచారాన్ని పాటించారు. అందేంటో తెలుసుకుందాం..
విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. ఈ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాకరమ్మ కొండపై ఆరిలోవ నీళ్లసర్రి వద్ద కొండభైరవుడు, జాకరమ్మలకు పూజలు నిర్వహించారు. ఈ దేవుళ్లను పూజిస్తే వరుణుడు కరిణించి వర్షాలు పుష్కలంగా కురిపిస్తాడని ఇక్కడ రైతులకు, గ్రామస్తులకు నమ్మకం. మామూలుగా అయితే ఎవరైనా వన భోజనాలకు వెళ్లి అక్కడ భోజనం చేసి.. కుటుంభ్యులతో కాస్తంత సమయాన్ని కేటాయిస్తూ.. ఎంజాయ్ చేస్తారు.
అక్కడే నాన్ వెజ్ వండుకొని వన భోజనాన్ని ఆరగిస్తారు. ఇక్కడ కూడా వాళ్లు వారితో పాటు బియ్యం, బెల్లంతో పిల్లా పాపలతో కలిసి గుట్టపై కి వెళ్లారు. అక్కడ దేవుళ్లకు నైవేద్యం సమర్పించిచే ముందు మేకలను, గొర్రెలను అమ్మవారికి బలిచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. దేవుళ్లకు సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని కొండ రాయిపై వంతుల్లా వేస్తారు.
తర్వాత వాటిని మోకాళ్లపై కూర్చొని.. ఒక్కొక్కరు ఆ పరమాన్నాన్ని నాలుకతో నాకి తిన్నారు. ఇలా పూజ చేస్తేనే వర్షాలు కురుస్తాయనే గ్రామస్తులు నమ్ముతారు. ఇలాంటి ఆచారాన్ని గ్రామస్తులు గత 60 సంవత్సరాల నుంచి పాటిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…