Tag Archives: wear

సోమవారం భస్మధారణ ఎందుకు చేస్తారో తెలుసా..?

ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజు శివుని పూజించే భక్తులు అందరూ తప్పనిసరిగా విభూదిని ధరిస్తారు. విభూది అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది అని చెప్పవచ్చు. శివుడికి ఇష్టమైన ఈ విభూదిని ధరించడం వల్ల వారికి అన్ని వేళలా ఆ పరమశివుడు తోడై ఉంటాడని పండితులు చెబుతున్నారు.భస్మధారణ చేయకుండా జపాలు, తపస్సులు చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు కలగవని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మన శరీరంలో 32 చోట్ల భస్మధారణ చేయాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా సోమవారం భస్మధారణ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

శిరస్సు, రెండు చేతులు, గుండె, నాభి అనే ఐదు ప్రదేశాల్లో భస్మాన్ని ధరించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మూడు గీతలు భస్మాన్ని ధరించడం వల్ల మన జీవితంలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఒక రోజు విహారానికి వెళుతూ తను ధరించడానికి నగలు, ఐశ్వర్యం కావాలని ఆ పరమశివుని అడగగా.. అందుకు శివుడు కొద్దిగా విభూతిని ఇచ్చి కుబేరుడి వద్దకు వెళ్లి విభూతిని ఇచ్చి తనకు కావలసింది తీసుకోమని తెలియజేస్తాడు.

శివుడు చెప్పిన విధంగానే పార్వతీదేవి ఆ విభూదిని తీసుకొని కుబేరుడు దగ్గరకు వెళ్లి ఆ విభూతికి సరిపడ నగలు ఇవ్వాల్సిందిగా కోరుతుంది.ఆ విధంగా విభూదిని త్రాసులో పెట్టి కుబేరుడు ఉన్న ఐశ్వర్యం అంతటిని త్రాసులో ఉంచినప్పటికీ కూడా త్రాసు లేవలేదు. దీనిని బట్టి శివుడు ఎంతో నిరాడంబరంగా ఉంటూ తన భక్తులకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకోసమే శివుని ఐశ్వర్య ప్రదాత అని కూడా పిలుస్తారు. అందువల్ల ఆ పరమశివుని పూజించే భక్తులు సోమవారం భస్మధారణ తప్పకుండా చేయాలని వేద పండితులు చెబుతున్నారు.

కరోనా సోకకుండా మాస్క్ వాడేవారికి షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో వైరస్ ఉధృతి ఆగేలా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి సోకకుండా ఉండటానికి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మినహా మరో మార్గం లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మాస్క్ ల గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాస్క్ వాడినా కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు మాస్కుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకోగలవని అయితే పూర్తిస్థాయిలో మాత్రం కాదని వెల్లడించారు. టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనుషుల తలలను పోలిన బొమ్మలను ఉంచి వాటికి ఎదురుగా వైరస్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కాటన్ మాస్క్ కేవలం 40 శాతం మాత్రమే వైరస్ ను అడ్డుకుంటుందని తేల్చారు.

కాటన్ మాస్కులతో పోలిస్తే ఎన్ 95 మాస్కులు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని… ఎన్ 95 మాస్కులు 90 శాతం వరకు కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నాయని చెప్పారు. మాస్కులు పెట్టుకున్నా వైరస్ సోకదనే గ్యారంటీ లేదని సాధారణ మాస్కులతో పోలిస్తే ఎన్ 95 మాస్కులు ధరించడం ఉత్తమమని వెల్లడించారు. తేమలో ఈ వైరస్ విచ్చిన్నం అవుతున్నట్టు గుర్తించామని తెలిపారు.

మరోవైపు కరోనా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న కొత్త వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరో రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండటం గమనార్హం.