ఈ ఆయుర్వేద మందులతో రోగనిరోధక శక్తిని పెంచుకోండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలియడంతో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే వివిధ రకాల ఆహార పదార్థాలను, కషాయాలను, పానీయాలను తయారు చేసుకొని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని భావిస్తున్నారు.

ఈ భయంకరమైన మహమ్మారినికట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల అనంతరం వ్యాక్సిన్ ను కనుగొన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మెడిసిన్ వల్ల కరోనా నుంచి తొందరగా విముక్తి కావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంలోనే ఎన్నో పరిశోధనలు జరిపిన ప్రభుత్వం సైతం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి తెలిపింది. కానీ కరోనా రాక మునుపే ఆయుర్వేదంలో ఈ విధమైనటువంటి మందులు ఎన్నో ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులు చాలా ఉన్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందాం.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువమంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం తిప్పతీగను అధికంగా ఉపయోగిస్తున్నారు. తిప్పతీగ చూర్ణం లేదా గుళికలు, పౌడర్ రూపంలో మనకు లభిస్తుంది.దీనిని తరచూ తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగ చూర్ణాన్ని మనకు జ్వరం చేసినప్పుడు మందులకు బదులుగా ఈ తిప్పతీగ కషాయం తాగడం వల్ల త్వరగా శరీర వేడిని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఆయుర్వేద మందులు తిప్పతీగ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.

తిప్పతీగలతోపాటు అశ్వగంధ, అతి మధురం, నేల వేము కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  అదేవిధంగా దాల్చిన చెక్క, మిరియాలు, సొంఠితో దీన్ని రూపొందించారు. వేడి చేసే గుణం గల ఈ కషాయంలో యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియా వైరస్ లను నాశనం చేయడానికి దోహదపడతాయి.ఈ విధమైనటువంటి ఆయుర్వేద మందులను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కామేశ్వరరావు తెలిపారు.