ఓ వ్యక్తి ఏటీఎం కార్డును మార్చి గుర్తుతెలియని వ్యక్తి రూ.24వేలను కొట్టేసాడు ఒక కేటుగాడు. బాధితుడు వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా, కేసముద్రం విలేజ్ లో నివశిస్తున్న బొల్లోజు జనార్దనాచారి శనివారం మండల కేంద్రంలోని ఏటీఎంలో తన డబ్బును డ్రా చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని లోపలికి వచ్చాడు. డబ్బులు రావడం లేదంటూ జనార్దనాచారి అతనిని హెల్ప్ అడగటంతో ఏటీఎం కార్డు ను తీసుకుని పిన్ నంబర్ను తెలుసుకున్నాడు. డబ్బు వస్తున్నట్టు ప్రయత్నం చేసాడు అయితే డబ్బు రాలేదు.
ఇక తన కార్డు తనకు ఇవ్వమని జనార్దనాచారి అడిగితే జనర్ధనాచారి కార్డుకు బదులుగా అతని వద్దనున్న మరో కార్డు ఇచ్చేసి వెళ్లిపోయాడు. జనార్ధనాచారి తనకార్డే అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా ఇంటికి వెళ్లాక సెల్ఫోన్కు డబ్బు డ్రా చేస్తున్నట్టు మెసేజ్లు వస్తుండటంతో, కార్డు మారినట్లు గుర్తించాడు. అయితే అప్పటికే అతని కార్డ్ నుండి రూ.24వేలు డ్రా చేసాడు ఆ ఆగంతకుడు. దీంతో ఏటీఎం కార్డును బ్లాక్ చేయించి బ్యాంకు అధికారులతో పాటు సోమవారం కేసముద్రం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…