ఈటెల రాజేందర్ పై ఫైర్ అయిన తలసాని!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగార్జున సాగర్ లో జానారెడ్డికి పట్టిన గతే రాజేందర్ కి పడుతుందన్నారు. గెల్లు శ్రీనివాస్ ని బానిసగా పేర్కొనడం ఈటెల అహంకారానికి నిదర్శమన్నారు.

హుజురాబద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఈటెలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే శ్రీనివాస్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.