ఇకపై హుండిలో కానుకలుకు కూడా క్యూఆర్ కోడ్..! స్కాన్ చేసి పేమెంట్ చేయడమే..!

ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు నడుస్తుంది. ప్రబుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తుంది.. తాజగా ఆంధ్రప్రదేశ్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ను ప్రారంభించారు సిఎం జగన్. క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించడం జరిగింది. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలి. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ పనిచేయనుంది. దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, ఆస్తుల నిర్వహణ, ఆదాయం, ఖర్చులు, డాష్‌బోర్డు, సిబ్బంది తదితర వివరాలు టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉంటాయి. భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించేలా క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది.

దేవాదాయశాఖ పరిధిలో ఆలయాలు, పలు సేవలను ఈ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో భాగం చేసారు. ఇకపై భక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా హుండికి కానుకలను సమర్పించే వెసులుబాటు కల్పించారు. అయితే తొలిసారిగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను మొదలుపెట్టారు.