Anchor Rashmi : యాంకర్ రష్మీ ని ఫిలిం ఛాంబర్ గేటుకి కట్టేసి కొడతా అన్న నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

Anchor Rashmi Gautam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై తన యాంకరింగ్ తో, ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. యాంకర్ రష్మీ కి యూత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా రష్మీ కు సహాయం చేసే గుణం ఎక్కువ. మూగజీవాల పై ఎక్కువగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మీ తనను బ్లాక్ మెయిల్ చేసింది అంటూ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు విషయంలోకి వెళితే.. ఇంటర్వ్యూ లో భాగంగా బాలాజీ నాగలింగం మాట్లాడుతూ.. నేను రష్మీ ని ఇచ్చిన మాట నిజమే.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

నేను సాధారణంగా ఎవరిని అంతగా తిట్టను.. కానీ రష్మీ ఎందుకు తింటాను అంటే.. రష్మీ మాతో రాణి గారి బంగ్లా అనే సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఆ సినిమాకు దివాకర్ బాబు దర్శకుడిగా డెబిట్ చేస్తున్నాడు. దీంతో సినిమాలో మెయిన్ రోల్ కోసం రష్మి గౌతమ్ ను అనుకోని ఆ తర్వాత మాట్లాడి రెమ్యునరేషన్ గురించి చెప్పాను అని తెలిపాడు బాలాజీ. అయితే ఆ సినిమాను లిమిటెడ్ బడ్జెట్లో చేయాలి అనుకుంటున్నట్లు, అదేవిధంగా ఆ సినిమా మేకింగ్ కు ఎంత ఖర్చు పెడుతున్నా మన విషయాన్ని చెప్పి అనంతరం ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వగలను అని చెప్పారట బాలాజీ.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

రష్మీ గుంటూరు టాకీస్ సినిమా ఓకే చేసిన తర్వాత సినిమా అంతా పూర్తి అయ్యి చివర్లో కేవలం ఒక సాంగ్ డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉన్నప్పుడు రష్మీ నేను చేయలేను హీరో ని మార్చేయండి అని ఇబ్బంది పెట్టింది అని తెలిపాడు బాలాజీ నాగలింగం. అప్పుడు అతను రష్మీ తో మాట్లాడగా.. అప్పుడు రష్మీ నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి తెలుసు, మిమ్మల్ని టీవీ9 ఎక్కిస్తాను, అది చేస్తాను ఇంత దూరం వెళ్తాను అంటూ బెదిరించి ప్రయత్నం చేసిందట. అప్పుడు బాలాజీ నాకు కూడా నాగబాబు తెలుసు, శ్యాం ప్రసాద్ రెడ్డి గారు కూడా తెలుసు నేను భూమి పుట్టినప్పుడు పుట్టిన వాడిని. 1974లో ఇండస్ట్రీకి వచ్చాను.. అలాంటిది చిన్నాపెద్దా లేకుండా నాతో నువ్వు మాట్లాడిన మాటలు రికార్డింగ్ కూడా ఉన్నాయి.. నిన్ను ఫిలింఛాంబర్ గేటుకి కొట్టేసి కొడతాను అని అన్నారట బాలాజీ.

గొప్ప హీరోయిన్లను చూసాను…

అంతేకాకుండా ఆమెను నిజం చెప్పమని నిజాయితీగా ఉండమని బెదిరించాడట. నా వయసెంత రష్మీ వయసు ఎంత ఒప్పుకున్న అంత రెమ్యూనరేషన్ తీసుకుని చివరిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి చివరకు మూడు నెలల తర్వాత వచ్చి సినిమాల్లో నటించిందని చెప్పుకొచ్చారు బాలాజీ. నేను శ్రీదేవి గారు లాంటి గొప్ప గొప్ప హీరోయిన్స్ ని చూశాను అని తెలిపారు. కానీ నటన పరంగా మాత్రం రష్మీ బాగా నటించింది. అంతేకాకుండా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారు సమయంలో వన్ మోర్ అని ఎప్పుడూ అడగలేదు.. కానీ మెంటాలిటీ బాగాలేదు అని చెప్పుకొచ్చారు బాలాజీ నాగలింగం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మీ బాలాజీ నాగలింగం వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.