వారిద్దరిలో ఒకరు వైల్డ్ కార్డు ఎంట్రీ..! కారణం అందేనా..

బుల్లితెరపై ఏ ప్రోగ్రాం అయినా హిట్ కావాలంటూ.. వాళ్లు చేసే కామెడీగానీ.. సెంటిమెంట్ గానీ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 రియాల్డీ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అందులో 19 మంది కంటెస్టెంట్లను పంపించిన నిర్వాహకులు ఎంటర్ టైన్ మెంట్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి.

అందులో తెలిసిన మొఖాలు నలుగురు లేక ఐదుగురు కంటే ఎక్కువగా లేరు. దీంతో ప్రేక్షకులకు వాళ్లు కనెక్ట్ కాలేకపోతున్నారు. బిగ్ బాస్ లో అసలు తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఇతర పాపులర్ షోలపై దృష్టి పెడుతున్నారు. దీనితో బిగ్ బాస్ షోకి ఆడియన్స్ ట్రాఫిక్ తగ్గిపోతున్నట్లు సమాచారం. దీనికి బదుల వేరే ప్రోగ్రాంలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై జోష్ ఇంకా పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రి జరగబోతోంది. అందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకరు లేదా ఇద్దరు క్రేజీ సెలెబ్రిటీలని హౌస్ లోకి పంపాలని డిసైడ్ అయినట్లు టాక్.

వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం బజర్దస్త్ వర్ష మరియు యాంకర్ వర్షిణి సౌందర్యరాజన్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. వారిద్దరిలో ఒకరి ఎంట్రీ తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుండటంతో ఈ రకమైన చర్యలను బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.