ఆ దేవాలయాలు ఎంతో అద్భుతం.. ఎందుకంటే?

మన భారతదేశం ఆధ్యాత్మిక మందిరాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయాలలో వెలిసిన దేవ దేవతల విశిష్టతలు తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయి. అయితే ఆ రహస్యాల వెనుక గల కారణం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే కొన్ని దేవాలయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

* స్వామి వారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయంగా కేరళలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయనమందిరం.

* 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కొని దేవాలయం బిజిలీ మహదేవ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది.

* సంవత్సరానికి ఒక్కసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు
1నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.

* నిరంతరం కోనేటిలో నీరు ప్రవహించే దేవాలయాలు
1.మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్,
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి

*నిరంతరం జ్వాలా రూపంగా వెలిగే దేవాలయాలు
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.

ఈ దేవాలయాలలో జరుగుతున్న ఈ వింత రహస్యాలను గురించి ఇప్పటి వరకు ఎంతోమంది అన్వేషించి నప్పటికీ ఈ రహస్యం అంతుచిక్కకుండా ఉండడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.