మోసం చేసి పెళ్లి చేశారు.. ఏడాది తర్వాత ఆమె జీవితం ఆగమ్యగోచరంగా మారింది..!

ఆమెకు చెప్పకూడని అబద్దాలు చెప్పి పెళ్లి చేశారు. వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తర్వాత అనారోగ్యంతో భర్త మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డితో కొంతకాలం వివాహం జరిగింది.

తర్వాత అతడికి రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులు ముందుగానే తెలుసు. కానీ ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. ఇదే కాకుండా కొన్నాళ్లకు అతడికి మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి.

ఇలా మానసికంగా, శారీరకంగా ఎంత కాలం బాధపడుతూ.. కుటుంసభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది. ఓ రోజు తన అత్తమామల ఇంటికి తన ఆరు నెలల కొడుకుతో బయలుదేరి వెళ్లింది. కానీ వాళ్లు ఆ ఇంటికి స్వాగతించలేదు. ఇంటికి వచ్చిన ఆమెపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహమాత్రం అక్కడే బైఠాయించింది.

గతంలోనూ ఇదేవిధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని ఊహ వాపోతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది.