Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

Tirupati MP: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు, దోపిడీలు చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మనకు తెలియకుండానే మన డబ్బులను టెక్నాలజీ సహాయంతో దొంగిలిస్తున్నారు.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!
Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

ఓటీపీ ఫ్రాడ్స్, లాటరీ వచ్చిందని ప్రజల్ని మోసాలు చేయడం ఇటువంటి కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏదో చదువుకోని వారు మోసపోతున్నారంటే.. ఏమో అనుకోవచ్చు, కానీ చదువుకుంటూ… ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. 

ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

తాజాగా రాజకీయ నాయకులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ కాల్ చేశాడు. సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తూ… తనను అభిషేక్ అనే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5 కోట్లు మంజూరైనట్లు నమ్మబలికాడు. 


ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

ఇదిలా ఉంటే మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్ డబ్బులు వేయాలన్న అభిషేక్.. 25 దరఖాస్తులకు ఒక్కొక్క దానికి రూ. 1.5 లక్షలు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన తిరుపతి ఎంపీ గురుమూర్తి… వెంటనే సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి విషయంపై ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరని నిర్థారించుకున్న తరువాత.. ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మెయిల్ ద్వాారా వివరాలను ఎంపీ, ఎస్పీకి పంపించాడు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ చీటర్ ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.