Parking Fee: పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!
Parking Fee: సాధారణంగా షాపింగ్ మాల్స్ నిర్వహించే వారు వినియోగదారులకు పార్కింగ్ ప్లేస్ ను కూడా అలాట్ చేస్తుంటారు. ఇది వారి బాధ్యత. అయితే ఈ పార్కింగ్ ప్లేస్ కు సదరు మాల్స్ వారు ఫీజు వసూలు చేస్తే… సరిగ్గా ఇదే విషయంపై కేరళలో ఓ వ్యక్తి హైకోర్ట్ ను ఆదేశించాడు.
దీంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్ చేస్తే మాల్స్కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్ పేర్కొన్నారు.
కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. నిజానికి బిల్డింగ్ రూల్స్ ప్రకారం… పార్కింగ్ స్థలంలో కూడా బిల్డింగ్ నిర్మాణంలో భాగంగానే ఉంటుందని.. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది.
ఫీజును రూ. 20 వసూలు చేసినందుకు..
కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ సొంత రిస్క్ తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఇటీవల వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్ ను వెళ్లినప్పుడు అతని నుంచి పార్కింగ్ ఫీజును రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్ట్ ను ఆశ్రయించారు. తన నుంచి పార్కింగ్ వసూలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఆయన అందుకు నిరాకరించారు. దీంతో మాల్ ఎగ్జిట్ గేట్ లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈమేరకు కోర్ట్ ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…