ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు.. అతనిలో అనుమానం.. ఊహించని విధంగా శవమై తేలింది..

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు విడిపోయి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇరు కుటుంబాల్లో వీళ్లకంటే పెద్ద వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. కొన్నాళ్లు ఆగిన తర్వాత చెబుదాం అనుకొని అక్కడే ఓ రూం తీసుకొని ఉంటున్నారు.

చివరకు ఓ రోజు ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన అంటోనీ గీత అనే యువతి.. కడప నగరంలోని నాగరాజుపేటకు చెందిన అనిల్ కుమార్.. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అక్కడ వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జాబ్ బంద్ చేసిన తర్వాత వీళ్లు అదే ప్రాంతంలోనే వేర్వేరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.

ప్రేమించుకున్న వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంట్లో చెప్పలేక పోయారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికావాల్సిన పెద్దవాళ్లుండటంతో కొన్నాళ్లు ఆగుదామని భావించారు. అయితే వీరిద్దరు ఒకే ప్రాంతంలో ఉండటంతో రూం తీసుకొని అక్కడే సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా తర్వాత అనిల్ కు గీతపై అనుమానం పెంచుకున్నాడు. నిన్ను నమ్మి నీతో ఉంటున్నా.. నన్ను మోసం చేస్తున్నావంటూ అతడు అనడంతో .. ఆమె తీవ్ర మనస్థాపం చెందింది.

అతడు లేని సమయం చూసి ఓ రోజు డాబాపైకి ఎక్కి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గీత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిల్ ను తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.