ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు విడిపోయి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇరు కుటుంబాల్లో వీళ్లకంటే పెద్ద వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. కొన్నాళ్లు ఆగిన తర్వాత చెబుదాం అనుకొని అక్కడే ఓ రూం తీసుకొని ఉంటున్నారు.
చివరకు ఓ రోజు ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన అంటోనీ గీత అనే యువతి.. కడప నగరంలోని నాగరాజుపేటకు చెందిన అనిల్ కుమార్.. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అక్కడ వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జాబ్ బంద్ చేసిన తర్వాత వీళ్లు అదే ప్రాంతంలోనే వేర్వేరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.
ప్రేమించుకున్న వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంట్లో చెప్పలేక పోయారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికావాల్సిన పెద్దవాళ్లుండటంతో కొన్నాళ్లు ఆగుదామని భావించారు. అయితే వీరిద్దరు ఒకే ప్రాంతంలో ఉండటంతో రూం తీసుకొని అక్కడే సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా తర్వాత అనిల్ కు గీతపై అనుమానం పెంచుకున్నాడు. నిన్ను నమ్మి నీతో ఉంటున్నా.. నన్ను మోసం చేస్తున్నావంటూ అతడు అనడంతో .. ఆమె తీవ్ర మనస్థాపం చెందింది.
అతడు లేని సమయం చూసి ఓ రోజు డాబాపైకి ఎక్కి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గీత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిల్ ను తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…