Tolly wood Actress: బడా వ్యాపారవేత్తతో అఫైర్ పెట్టుకున్న హీరోయిన్.. అసలు నిజం ఏమిటంటే?

Tolly wood Actress: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్లు ఒక అద్దాల మేడ వంటి వారు. వారిపై ఎప్పుడు ఏ విధంగా రాళ్లు పడతాయో ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో షికారులు చేయడమే కాకుండా వారిని దారుణంగా కించపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఈ విధమైనటువంటి చేదు అనుభవాలు అధికంగా ఉంటాయి.

ఈ క్రమంలోనే ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన నటి కస్తూరి శంకర్ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ చెల్లెలు పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలోను అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఒక బడా వ్యాపారవేత్తతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు గతంలో పెద్ద ఎత్తున వచ్చాయి.అయితే ఈ వార్తల గురించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి శంకర్ ను యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కస్తూరి శంకర్ సమాధానం ఇస్తూ…తనకి ఓ 70 సంవత్సరాలు వయసున్న ఒక వ్యాపారవేత్తతో అఫైర్ ఉందనే వార్తలు రావడం చాలా బాధాకరం అంటూ సమాధానం చెప్పారు.

నేను నచ్చకపోవడం వల్లే ఇలాంటి వార్తలను సృష్టించారు.

అయితే గతంలో ఒక విషయం గురించి నేను ఆ వ్యాపారవేత్తను కలిసిన విషయం నిజమే అయితే ఓ ముఖ్యమైన విషయం గురించి తనను మేము కలవగానే ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం.ఈ క్రమంలోనే మీడియా వాళ్ళు నా గురించి ఇలాంటి వార్తలు సృష్టించారని, అయితే నేనంటే గిట్టని వాళ్లు మాత్రమే ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేశారు అంటూ కస్తూరి శంకర్ ఈ సందర్భంగా సమాధానం చెప్పారు. అయితే ఆ ప్రముఖ వ్యాపార వేత్త ఎవరు ఏంటి అనే విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.