టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల మంగళవారం తెల్లవారు జామున ఆసుపతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. నోముల మృతితో కుటుంబసభ్యులు మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.