మనలో చాలామంది పోస్టాఫీస్ లో అకౌంట్ ను కలిగి ఉంటారు. బ్యాంకులతో సమానంగా పోస్టాఫీస్ లు కొత్తకొత్త స్కీమ్ ల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ లలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మినిమమ్ బ్యాలన్స్ కు సంబంధించిన నిబంధనలు మారడంతో పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న కస్టమర్లపై నిబంధనల ప్రభావం పడనుంది.
ఇకపై పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్న కస్టమర్లు ఖచ్చితంగా మినిమం బ్యాలన్స్ ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మినిమం బ్యాలన్స్ లేకపోతే చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్నవాళ్లు మినిమం బ్యాలన్స్ నిబంధనల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటివరకు మినిమం బ్యాలన్స్ పోస్టాఫీస్ అకౌంట్లలో ఉంచని వాళ్లు డిసెంబర్ 11 నుంచి కనీసం 500 రూపాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరైతే కనీసం 500 రూపాయలు మినిమం బ్యాలన్స్ ఉంచరో వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మినిమం బ్యాలన్స్ లేకపోయినా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మినిమం బ్యాలెన్స్ ఉండకపోతే జరిమానా రూపంలో 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జీల నగదు కూడా ఖాతాలో లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నవాళ్లకు ఏటీఎం, చెక్ బుక్, మొబైల్ బ్యాంకింగ్ తో పాటు ఇతర సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ లు సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు 4 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తేనే వడ్డీని పొందవచ్చు. కనీసం ఒక లావాదేవీనైనా గడిచిన మూడు సంవత్సరాల్లో చేసి ఉంటే పోస్టాఫీస్ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…