రేవంత్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్!

టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభను పెట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై రేవంత్ భాష సరిగా లేదని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఎంపీగా గౌరవ భాష మాట్లాడాలన్నారు.

దళితులను చిన్నచూపు చూసే రేవంత్​ను తెలంగాణ సమాజం సహించదన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దళిత బంధు పథకమంటే రేవంత్ రెడ్డికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సహించలేకనే అరోపణలు చేస్తున్నారని విమర్శించారు.