నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరగలేదు. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 188 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

డిసెంబర్ నెల 13, 14 తేదీలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు త్వరలో స్టీల్ ప్లాంట్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గ్యాడ్యుయేషన్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే మెకానికల్ బ్రాంచ్ చదివిన వాళ్లకు అత్యధికంగా 77 ఖాళీలు ఉన్నాయి.

ఆ తరువాత ఎలక్ట్రికల్ 45, కెమికల్ 26, మెటలర్జీ 19, సివిల్ 5, సిరామిక్స్ 4, మైనింగ్ కు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్రకటన విడుదల చేసి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. అయితే పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది.

సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రశ్నలు కఠినంగా ఉంటాయి కాబట్టి సమాధానాలను ఎంచుకునే విషయంలొ జాగ్రత్త వహిస్తే సులువుగా ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.