భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సంగతి విదితమే. దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.
అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ప్రజలు మాస్క్ ధరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ దేశవ్యాప్తంగా వైరస్ విజృంభించే అవకాశం ఉందని సెకండ్ వేవ్ మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 7,400 కొత్త కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి.
రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజలు మాస్క్ ధరించకపోతే 2,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు పూజలు, పండుగలు ఇంటి దగ్గరే జరుపుకోవాలని జనం ఒకేచోట గుమికూడితే వైరస్ ఒకరినుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వేడుకలను రద్దు చేయడం లేదని అయితే జనం గుమికూడటాన్ని మాత్రం నిషేధిస్తున్నామని తెలిపారు.
వైరస్ వేగంగా వ్యాప్తి చెంది పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రజలు పెద్దసంఖ్యలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్య 5 లక్షలు దాటిందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వం భారీగా జరిమానా విధిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇకనైనా కరోనా నిబంధనలు పాటిస్తారో లేదో చూడాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…