భార్యపై అత్యాచారం చేసేందుకు ప్రేరేపించిన భర్త..! అతడి స్నేహితులతో..!

వాళ్లకు వివాహం అయి కొన్ని సంవత్సరాలు దాటింది. అయితే వీరివురి కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ వివాదాన్ని మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భర్త తన భార్యతో నీచాతినీచమైన పని చేయించినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బజార్ శుక్లా పట్టణంలో శ్రావణ్ కుమార్ తన భార్య నివసిస్తున్నారు.

అతడికి తన భార్య తరఫును బంధువులకు ఓ వివాదం నడుస్తోంది. దానికి సంబంధించి కేసు కూడా కోర్టులో పెండింగ్ ఉంది. అయితే ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఏ భర్త చేయని పని చేశాడు ఈ కసాయి భర్త. ఓ రోజు తన స్నేహితులను ఇంటికి పిలిపించాడు.

అతడి ఎదురుగానే ఆమెపై అత్యాచారం చేసేందుకు శ్రావణ్ కుమార్ మరియు అతడతి స్నేహితులను ప్రేరేపించినట్లు ఆమె చెప్పింది. వచ్చిన వాళ్లళ్లో ఒకరు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత తనపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు కూడా వెనుకాడలేదని పోలీసులకు తెలిపింది. అ సమయంలో తాను గట్టిగా అరవడంతో చుట్టుపక్కన ఉండే స్థానికులు రాగా.. వారు అక్కడ నుంచి పారిపోయినట్లు చెప్పింది.

ఆ సమయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు.. కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. అందుకే అమేథి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు ఆమె పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సింగ్‌కు తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా దినేష్ సింగ్ కోరారు. ఈ వ్యవహారం అంతా ఆస్తికి సంబంధించినదిగా తెలుస్తోంది.