కాసేపట్లో వివాహం జరుగుతుందనగా.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగింది.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు.
వీరికి ఒక కూతురు ఉన్నారు. ఆమెకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పెళ్లి ఓ ఫంక్షన్ హాల్ లో జరుగుతుండగా.. ఆ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక పెళ్లి జరుగుతుండగా.. పంతులు కన్యాదానం చేయడానికి వధువు తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరాడు. వాళ్ల కోసం బంధువులు వెతికారు.. అయినా ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లి చూడగా విగత జీవులుగా పడి ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థతి గత కొంత కాలంగా మంచిగా లేదని.. మానసిక వ్యాధితో బాధపడేదని పోలీసులు తెలుసుకున్నారు. చుట్టు పక్కల వారితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పెళ్లింట్లో కూడా గొడవ పడిన ఆమె ప్రవర్తనతో జగన్నాథరావు విసుగు చెందాడు.
దీంతో ఆమెను చంపి.. తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు కన్న తల్లిదండ్రులు చనిపోయి.. అటు పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఆ వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…