ఈ మధ్యకాలంలో దొంగల బీభత్సం తగ్గుముఖం పట్టిందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల కారణంగా ఆ కేసులను ఛేదించడంలో విజయవంతం అయ్యామని.. ఈ క్రైమ్ రేటు తగ్గిందని చెబుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను తుపాకీతో బెదిరించి మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకొని దర్జాగా వెళ్లిపోయాడు.
దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను మరో స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు వెంబడించారు. ఓ మూల మలుపు వద్ద కాపు కాసి.. ఆ స్కూటీపై వచ్చిన వారిని ఆపారు. తమ దగ్గర ఉన్న గన్నును పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరించారు. వెనుకాల కూర్చున్న వ్యక్తి వారించినా వాళ్లు వినలేదు.
ఇద్దరు భయంతో ఉండగా.. స్కూటీ నడుపుతున్న ఆ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తీసుకొని తాపీగా వెళ్లాడు. కొద్దిగా ముందుకు వెళ్లి తనతో పాటు వచ్చిన వ్యక్తి బైక్ ఎక్కి ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ జనాలు ఉన్నా.. ఎవరూ ముందుకు రాలేదు.
కనీసం అతడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేక పోయారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…