ఈ మధ్యకాలంలో దొంగల బీభత్సం తగ్గుముఖం పట్టిందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల కారణంగా ఆ కేసులను ఛేదించడంలో విజయవంతం అయ్యామని.. ఈ క్రైమ్ రేటు తగ్గిందని చెబుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను తుపాకీతో బెదిరించి మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకొని దర్జాగా వెళ్లిపోయాడు.
దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను మరో స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు వెంబడించారు. ఓ మూల మలుపు వద్ద కాపు కాసి.. ఆ స్కూటీపై వచ్చిన వారిని ఆపారు. తమ దగ్గర ఉన్న గన్నును పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరించారు. వెనుకాల కూర్చున్న వ్యక్తి వారించినా వాళ్లు వినలేదు.
ఇద్దరు భయంతో ఉండగా.. స్కూటీ నడుపుతున్న ఆ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తీసుకొని తాపీగా వెళ్లాడు. కొద్దిగా ముందుకు వెళ్లి తనతో పాటు వచ్చిన వ్యక్తి బైక్ ఎక్కి ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ జనాలు ఉన్నా.. ఎవరూ ముందుకు రాలేదు.
కనీసం అతడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేక పోయారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…