శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ బెగంపేట్ విమానాశ్రాయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. అక్కడ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌,ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు తిరిగి అమిత్ షా హైదరాబాద్ చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.