Aara Mastan: ఈ ఐదేళ్లు టీడీపీ కోసమే పని చేశా.. ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు?

Aara Mastan: ఆరా మస్తాన్ పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఇదివరకు ఎన్నికల ఫలితాలపై ఎన్నో సర్వేలను నిర్వహించారు. అయితే ఏ సర్వేలు కూడా వ్యతిరేకంగా రాలేదు కానీ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల విషయంలో ఈయన చేసిన సర్వే బెడిసి కొట్టింది. ఈయన వైఎస్ఆర్సిపి పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపారు సుమారు 110 సీట్ల వరకు వస్తాయని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈయన సర్వే పై ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. ఎన్నికల ఫలితాలు కేకే సర్వేకు అనుకూలంగా రావడంతో ఆరా మస్తాన్ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయారు. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ వారికి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సంచలనంగా మారింది.

తాను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి డబ్బులు తీసుకొని ఇలాంటి సర్వేలు చేయలేదని తెలిపారు. నేను గతంలో ఎన్నో సర్వేలు చేశాను అవన్నీ కూడా సక్సెస్ అయితే స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలతో తాను మాట్లాడి చేసిన సర్వే ఫలితాలని వెల్లడించానని కానీ అవి తన ఊహకు అందకుండా వచ్చాయని తెలిపారు. ఇక నేను వైసిపి నేతలతో డబ్బు తీసుకోలేదు.

పవన్ వల్లే కూటమి గెలుపు..
తాను గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసాను. తాను భగవద్గీత ఖురాన్ మీద కూడా ప్రమాణం చేసి చెబుతున్నాను. వైసిపి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని తెలిపారు.ఇక ఏపీలో.. పవన్ కళ్యాణ్ కారణంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని వివరించారు. ఏపీలో తమ సర్వేలు విఫలం కావడానికి గల రిపోర్ట్ ను తయారు చేస్తున్నామని… త్వరలోనే దానిపై విశ్లేషణ చేస్తామని ఆరా మస్తాన్ వివరించారు.