Actor Krishna: కుటుంబ పరువు పోతుంది.. నరేష్ పవిత్ర వ్యవహారంపై కృష్ణ సీరియస్?

Actor Krishna: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి మీడియా వార్తల్లో ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. నరేష్ విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలోనే నటుడిగా కమెడియన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విడుదుడుకులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో ఈయన రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఇక ఈ వ్యాఖ్యలపై నటి పవిత్ర లోకేష్ స్పందిస్తూ మేము రిలేషన్ లో ఉన్న విషయం కృష్ణ గారి ఫ్యామిలీకి కూడా తెలుసు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా వీరి వ్యవహారం రోజు రోజుకు వైరల్ కావడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. ఇక రమ్య ఎంట్రీ ఇవ్వడంతో వీరి వివాదం తారస్థాయికి చేరింది. రమ్య ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విధంగా వీరి మధ్య గొడవల కారణంగా కృష్ణ ఫ్యామిలీ కూడా ప్రస్తావనలోకి వచ్చింది. దీంతో కృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

తన పేరు ప్రస్తావన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణ..

నరేష్ పవిత్ర వ్యవహారం వల్ల కృష్ణ గారి పేరుతో పాటు ఆయన కుటుంబం గురించి కూడా వార్తల్లో రావడంతో కృష్ణ కుటుంబ పరువు పోతుందని భావించి నరేష్ ను మందలించడమే కాకుండా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నరేష్ పై కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారనేది మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.