Actress Divya Vani : వేణు మాధవ్ తో నటించడం ఏంటి అంటే… బాపు గారు ఒకటే అన్నారు…: నటి దివ్యవాణి

Actress Divya Vani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాలో సత్యభామ గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్శించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించిన తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవల ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

వేణు మాధవ్ పక్కనా అని ఆలోచించా…

దివ్య వాణి తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక పెళ్లయ్యాక నటన కు గుడ్ బై చెప్పేసిన ఆమె మళ్ళీ చాలా రోజులకు శ్రీకాంత్ హీరోగా నటించిన ‘రాధా గోపాలం’ సినిమాలో నటించారు. అమాయకపు భార్య పాత్ర కాసులమ్మ పాత్రలో తాగుబోతు భర్త గా ఆమెకు జోడిగా వేణు మాధవ్ నటించారు. అయితే మొదట బాపు గారు ఈ పాత్ర గురించి చెప్పినపుడు వేణుమాధవ్ పక్కన నేను నటించడం ఏమిటి అనే సందేహం వచ్చిందట.

అదీ కాక అప్పటికి బాగా లావుగా ఉన్న దివ్య వాణి ఆలోచించారట. అయితే బాపు గారు ఒకటే చెప్పారట, ఈ పాత్ర నీకోసం రాసాము సౌందర్య ఆలీ, బాబు మోహన్ తో డాన్స్ చేసింది అలానే నువ్వు ఈ క్యారెక్టర్ చేయి మంచి పేరు వస్తుంది అని చెప్పారట. అలా ఆ సినిమాలో నటించానని చాలా మంది సినిమా విడుదల అయ్యాక సన్నగా ఉండి ఉంటే నువ్వే శ్రీకాంత్ పక్కన హీరోయిన్ గా బాగుండేదానివి అంటూ కామెంట్స్ చేసారని, అయితే స్నేహ కూడా చాలా బాగా నటించింది అంటూ తెలిపారు దివ్య వాణి.