Actress Jamuna: వెండితెర సత్యభామ… సీనియర్ నటి జమున కన్నుమూత!

Actress Jamuna: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీనియర్ నటి జమున ఇకలేరు. ఈమె నేడు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు. జమున మరణ వార్త తెలియగానే సినీ సెలెబ్రెటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున 1936 ఆగస్టు 30వ తేదీన హంపిలో జన్మించారు. ఈమె 1953 వ సంవత్సరంలో పుట్టిల్లు అనే సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈమెకు మిస్సమ్మ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మూగమనసులు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు

ఏఎన్ఆర్ సావిత్రి నటించిన మూగమనసులు సినిమాలో ఈమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ జగ్గయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమె తెలుగులో సుమారు 150 కి పైగా సినిమాలలో నటించారు.

Actress Jamuna: రేపు జమున అంత్యక్రియలు…

ఇలా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో నటించి మెప్పించిన జమున నేడు అనారోగ్య సమస్యలతో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆఖరి శ్వాస వదిలారు.ఇక ఈమె పార్తివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు రేపు ఉదయం ఈమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈమె మరెన్నో వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.