Actress Jamuna: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీనియర్ నటి జమున ఇకలేరు. ఈమె నేడు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు. జమున మరణ వార్త తెలియగానే సినీ సెలెబ్రెటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున 1936 ఆగస్టు 30వ తేదీన హంపిలో జన్మించారు. ఈమె 1953 వ సంవత్సరంలో పుట్టిల్లు అనే సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈమెకు మిస్సమ్మ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మూగమనసులు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు
ఏఎన్ఆర్ సావిత్రి నటించిన మూగమనసులు సినిమాలో ఈమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ జగ్గయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమె తెలుగులో సుమారు 150 కి పైగా సినిమాలలో నటించారు.
ఇలా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో నటించి మెప్పించిన జమున నేడు అనారోగ్య సమస్యలతో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆఖరి శ్వాస వదిలారు.ఇక ఈమె పార్తివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు రేపు ఉదయం ఈమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈమె మరెన్నో వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…