Movie News

Actress Jamuna: వెండితెర సత్యభామ… సీనియర్ నటి జమున కన్నుమూత!

Actress Jamuna: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీనియర్ నటి జమున ఇకలేరు. ఈమె నేడు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు. జమున మరణ వార్త తెలియగానే సినీ సెలెబ్రెటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున 1936 ఆగస్టు 30వ తేదీన హంపిలో జన్మించారు. ఈమె 1953 వ సంవత్సరంలో పుట్టిల్లు అనే సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈమెకు మిస్సమ్మ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మూగమనసులు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు

ఏఎన్ఆర్ సావిత్రి నటించిన మూగమనసులు సినిమాలో ఈమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ జగ్గయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమె తెలుగులో సుమారు 150 కి పైగా సినిమాలలో నటించారు.

Actress Jamuna: రేపు జమున అంత్యక్రియలు…

ఇలా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో నటించి మెప్పించిన జమున నేడు అనారోగ్య సమస్యలతో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆఖరి శ్వాస వదిలారు.ఇక ఈమె పార్తివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు రేపు ఉదయం ఈమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈమె మరెన్నో వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

8 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

9 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

9 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

9 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

11 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

12 hours ago