Actress Jamuna: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీనియర్ నటి జమున ఇకలేరు. ఈమె నేడు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు. జమున మరణ వార్త తెలియగానే సినీ సెలెబ్రెటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున 1936 ఆగస్టు 30వ తేదీన హంపిలో జన్మించారు. ఈమె 1953 వ సంవత్సరంలో పుట్టిల్లు అనే సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈమెకు మిస్సమ్మ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మూగమనసులు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు
ఏఎన్ఆర్ సావిత్రి నటించిన మూగమనసులు సినిమాలో ఈమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ జగ్గయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమె తెలుగులో సుమారు 150 కి పైగా సినిమాలలో నటించారు.
ఇలా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో నటించి మెప్పించిన జమున నేడు అనారోగ్య సమస్యలతో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆఖరి శ్వాస వదిలారు.ఇక ఈమె పార్తివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు రేపు ఉదయం ఈమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈమె మరెన్నో వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…