Balakrishna: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ చిత్ర పరిశ్రమలోను ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని చెప్పాలి.బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని తొక్కినేని అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.
ఇలా ఈ విషయంపై అక్కినేని వారసులు నాగచైతన్య అఖిల్ కూడా స్పందించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందించారు.
ఈ క్రమంలోనే తాజాగా హిందూపురంలో పర్యటించిన బాలయ్య అక్కినేని వివాదం పై స్పందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఈయన చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ ఎవరిని కించపరచాలని తాను మాట్లాడలేదని తెలిపారు.నేను ఏఎన్ఆర్ గారిని బాబాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తాను తన పిల్లల కన్నా ఆయనకు నేనంటేనే చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు.
తన తండ్రి ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకోగా తన బాబాయ్ ఏఎన్ఆర్ గారి నుంచి పొగడ్తలకు పొంగి పోకూడదు అనే విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారు.నాన్న చనిపోయిన తర్వాత ఆయన పేరు పై జాతీయ అవార్డును ప్రకటించడంతో ఆ అవార్డును మొదటిసారిగా ఏఎన్ఆర్ గారికి అందించామని తెలిపారు.ఆయనపై ప్రేమ ఇప్పటికీ నా గుండెల్లో అలాగే ఉంది బయట ఏం జరిగినా తనకు సంబంధం లేదని ఈ సందర్భంగా బాలకృష్ణ అక్కినేని వివాదం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…